వాత్సల్యం చూపలేదు..!
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు.
సాయం కోసం విధివంచితులు, అభాగ్యుల ఎదురుచూపులు
- న్యూస్టుడే, రామచంద్రపురం టౌన్ (పామర్రు)
- కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. వాత్సల్యం పథకం కింద సాయం కోసం ఏడాది కిందట దరఖాస్తు చేసుకున్నాడు. ఎదురు చూపులే మిగిలాయి తప్ప ఇంత వరకు సాయం అందలేదు.
- కె.గంగవరం మండలం పేకేరుకు చెందిన కాకినాడ లోవరాజు విద్యుత్తు లైన్లు వేయడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేసేవాడు. ఒకసారి పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అతని భార్య కూలి పనులు చేసి ఇద్దరు కుమారులను చదివిస్తోంది. వాత్సల్యం పథకంలో లబ్ధి చేకూరుతుందని తెలిసి కార్యాలయాల చుట్టూ తిరిగి భర్త మరణ ధ్రువపత్రం సంపాదించి సాయం కోసం దరఖాస్తు చేసుకోగా ఉన్నతాధికారులు పరిశీలన కూడా పూర్తయ్యింది. నిబంధనల ప్రకారం అర్హతలున్నా సాయం మాత్రం అందలేదు.
వీరే కాదు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చాలామంది దరఖాస్తుదారులది ఇదే పరిస్థితి. విధి వంచిత చిన్నారులు, అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తుందనుకున్న మిషన్ వాత్సల్య పథకం అతీగతీ లేకుండా పోయింది. ఆర్థిక సాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు నిరాశే మిగులుతోంది.
ఇదీ పథకం స్వరూపం
తల్లిదండ్రులు దూరమై.. బతుకు భారమై అల్లాడుతున్న పిల్లలకు అండగా నిలుస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వారి విద్య, వైద్య అవసరాలను తీర్చేందుకు, ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు మిషన్ వాత్సల్య పథకాన్ని తెరపైకి తెచ్చింది.. అనాథలు, అభాగ్యులు, తల్లిదండ్రులను కోల్పోయినవారు, తల్లి లేక తండ్రిని కోల్పోయిన వారు, విడాకులు పొందిన తల్లిదండ్రులున్న వారు, తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నవారు, అక్రమ రవాణా, దాడులకు గురైన బాలబాలికలు, యాచకులు, బాల్య వివాహాలు, హెచ్ఐవీ పీడిత బాలలు, దివ్యాంగుల్లో ఎంపిక చేసిన వారికి నెలకు రూ.4000 చొప్పున ఆర్థికసాయం ఇస్తామని ప్రకటించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులు 60, రాష్ట్ర ప్రభుత్వానిది 40 శాతం. కేంద్రం నిధులు ఇస్తామంటున్నా కూడా రాష్ట్రం తగిన మంజూరులు చేయకపోతుండడంతో పథకం అమలు నిలిచిపోయింది.
ఏడాది కిందటే దరఖాస్తుల పరిశీలన
గత ఏడాది ఏప్రిల్ నెలలో డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, కొత్తపేట, రాజోలు, కపిలేశ్వపురం, రాయవరం ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,726 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 12,500 దరఖాస్తులు స్వీకరించారు. వాటిని తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, సీడీపీవో, ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు సభ్యులుగా ఉన్న మండలస్థాయి కమిటీలు పరిశీలించి 9,700 దరఖాస్తులు అర్హత ఉన్నట్లు గుర్తించి జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయానికి పంపించారు. ఇంత వరకు అతీగతీ లేదు.
ఎన్నికల హడావుడిలో ఉన్నాం..
ఝాన్సీరాణి, పీడీ, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ హడావుడిలో ఉన్నాం. దాంతో ఈ పథకం అమలుపై దృష్టి సారించలేకపోతున్నాం. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం అందుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!