నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే.
అర్చకులపై దాడి ఘటనలో విమర్శలకు తావిచ్చిన కొందరి తీరు
దాడి ఘటనపై దేవాదాయ శాఖ ఆర్జేసీˆకి వివరిస్తున్న అర్చకులు (పాతచిత్రం)
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, గాంధీనగర్: తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. రాజకీయం బుసలు కొడుతోంది.. యంత్రాంగం సాహో అంటుంది. ఐదేళ్ల వైకాపా జమానాలో జరుగుతున్నది ఇదే.. తాజాగా కాకినాడ దేవాలయం వీధిలోని పెద్ద శివాలయంలో శివయ్య సన్నిధిలోనే వైకాపా నాయకుడు ఇద్దరు అర్చకులపై దాడిచేసి.. అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో ఇదే జరిగింది. తప్పుచేసిన వ్యక్తిని శిక్షించాల్సిందిపోయి.. కేసు నీరుగార్చే ప్రయత్నాలకు అధికార పార్టీ తెగబడడం విమర్శలకు తావిస్తోంది.
ఆ తీరు వివాదాస్పదం..
కాకినాడలో ఇద్దరు అర్చకులపై దాడి వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఓటు బ్యాంకుపై ప్రభావం చూపకుండా సద్దుమణిగించే చర్యల్లో వైకాపా నేతలు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే దేవాదాయశాఖలోని కొందరి ఉద్యోగులపై ఒత్తిళ్లు పెరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైకాపా నాయకుడి చేతిలో దెబ్బలు తిన్న, అవమానానికి గురైన అర్చకులతో పోలీసులకు నేరుగా ఫిర్యాదు ఇప్పించాలి. జరిగిన విషయం వివరంగా నమోదుచేయించాలి. ఇక్కడ అదేమీ జరగలేదు. అర్చకుల నుంచి ఆలయ ఈవో రాజేశ్వరరావు ఫిర్యాదు స్వీకరించారు. కేసు తీవ్రత తగ్గేలా పైపైన క్లుప్తంగా రాయించారు. దాని ఆధారంగా ఈవో పోలీసులకు ఫిర్యాదిచ్చారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భర్తకు ప్రాణహాని లేకుండా చూడాలని అర్చకుని భార్య మీడియా ఎదుట కోరారు.. బాధిత కుటుంబాల ఆందోళనను సైతం పరిగణనలోకి తీసుకోలేదు. దాడి ఘటనను బ్రాహ్మణ సంఘాలు జిల్లా దేవాదాయ శాఖ అధికారి పులి నారాయణమూర్తి దృష్టికి తీసుకెళ్తే.. తన పరిధిలోని అంశం కాదని.. డీసీతో మాట్లాడుకోండని తప్పించుకున్నారు. వైకాపా నాయకులకు మేలు చేయాలనే ఉద్దేశమే కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆ కెమెరానే ఎందుకు పనిచేయదు
శివాలయంలో 15 సీసీ కెమెరాలతో నిఘా ఉంటే.. దాడి జరిగిన ప్రాంతంలోని కెమెరా మాత్రమే ఎందుకు పనిచేయడంలేదన్న దానికి సమాధానం లేదు. మొత్తం మీద వైకాపా నాయకుడిని రక్షించే ప్రయత్నాల్లో కొందరు సర్వశక్తులూ ఒడ్డారు. దాడి ఘటనపైనే కాకుండా, శాఖాపరమైన లోపాలపైనా లోతుగా విచారణ జరిపి ఇలాంటివి పునరావృతం కాకుండా భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవాలని అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు