logo

యువకుని ఆత్మహత్య

ఆత్రేయపురం మండలం, రాజవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 18 Apr 2024 20:25 IST

ఆత్రేయపురం: ఆత్రేయపురం మండలం, రాజవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీనివాసు తెలిపిన వివరాల ప్రకారం.. కోట సత్యనారాయణ అలియాస్‌ సత్తిబాబు(24) వ్యవసాయం చేసుకుంటూ తల్లి వద్దనే ఉంటున్నాడు. అరటితోట సాగు కోసం రూ.10 లక్షల అప్పు చేశాడు. తోట దిగుబడి రాకపోవడంతో నష్టం వచ్చింది. మనస్తాపంతో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న సోదరుడు వెంకన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని