పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది.
జనవరి-మార్చిలో 136.6 టన్నుల కొనుగోళ్లు
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. 2023 ఇదే త్రైమాసిక గిరాకీ 126.3 టన్నులతో పోలిస్తే ఇది 8% ఎక్కువ. బంగారం కొనుగోళ్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దూకుడు కూడా ఇందుకు కలిసొచ్చింది. సమీక్షా త్రైమాసికంలో 19 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. 2023 మొత్తంమీద ఆర్బీఐ కొనుగోలు చేసిన బంగారం 16 టన్నులే కావడం గమనార్హం. విలువ పరంగా చూస్తే దేశీయ పసిడి గిరాకీ 20% పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది. త్రైమాసికంలో సగటు ధర 11% పెరిగినా.. పుత్తడికి గిరాకీ ఇంతగా లభించిందని ప్రపంచ స్వర్ణమండలి (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసిన ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1 2024’ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం..
ఈ ఏడాది 700-800 టన్నుల మేర
దేశీయంగా పసిడికి మొత్తం గిరాకీ (ఆభరణాలు, పెట్టుబడులు కలిపి) 2023 జనవరి-మార్చిలో 126.3 టన్నులుగా ఉండగా.. ఈ ఏడాది ఇదే కాలంలో 136.6 టన్నులకు పెరిగింది. ఆభరణాల గిరాకీ (4%)తో పోలిస్తే, పెట్టుబడుల గిరాకీ (19%)లో వృద్ధి అధికంగా ఉంది. భారత్కున్న బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులే, పసిడి ఆభరణాల గిరాకీకి మద్దతుగా నిలిచినట్లు డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ సచిన్ జైన్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో పసిడికి గిరాకీ 700-800 టన్నులుగా ఉండొచ్చని అంచనా వేశారు. బంగారం ధరలు మరీ ఎక్కువగా పెరిగితే 700 టన్నులకు పరిమితం కావొచ్చన్నారు. 2023లో ఇది 747.5 టన్నులుగా నమోదైంది.
తొలి సారిగా..
సాధారణంగా భారత్, చైనా మార్కెట్లలో పసిడి ధరలు తగ్గినప్పుడు, గిరాకీ పెరుగుతుంది. పశ్చిమ దేశాల్లో పెట్టుబడుల రీత్యా కొంటారు కనుక ఇందుకు విరుద్ధ ధోరణి ఉంటుంది. అయితే తొలిసారిగా భారత, చైనా మార్కెట్లలో బంగారం ధరలు పెరిగినా.. గిరాకీ రాణించడం విశేషమని జైన్ తెలిపారు. ఆర్బీఐ 2023లో 16 టన్నులు పసిడి కొనగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే 19 టన్నులు సొంతం చేసుకోవడం కూడా కలిసివచ్చిందన్నారు.
విలువ పరంగా చూస్తే..
- దేశీయంగా పసిడి గిరాకీ విలువ రూ.63,090 కోట్ల నుంచి రూ.75,470 కోట్లకు చేరింది. ఇందులో ఆభరణాల గిరాకీ రూ.45,890 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.52,750 కోట్లకు; పెట్టుబడుల గిరాకీ రూ.17,200 కోట్ల నుంచి 32% అధికంగా రూ.22,720 కోట్లకు చేరుకుంది.
- పాత బంగారం మార్పిడి 38.3 టన్నులుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 10% అధికం.
- త్రైమాసిక సగటు ధర (10గ్రా.) రూ.49,943.80 నుంచి రూ.55,247.20కు చేరుకుంది. (దిగుమతి సుంకం, జీఎస్టీ లేకుండా).
ప్రపంచ గిరాకీ సైతం: ప్రపంచ స్థాయిలోనూ పసిడికి గిరాకీ జనవరి-మార్చిలో వార్షికంగా 3% పెరిగి 1238 టన్నులకు చేరింది. 2016 తర్వాత బలమైన త్రైమాసికం ఇదే. అధిక ధరల్లోనూ ఈ రికార్డు సాధించడం విశేషం. సమీక్షా త్రైమాసికంలో కేంద్ర బ్యాంకులు మొత్తం మీద 290 టన్నుల బంగారాన్ని జత చేసుకున్నాయి.
- ఎలక్ట్రానిక్స్ రంగంలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం అధికమైనందున, సాంకేతిక పరికరాల రంగంలోనూ పసిడికి గిరాకీ 10% పెరిగింది.
- సరఫరా వైపు చూస్తే.. ఉత్పత్తి 4% హెచ్చి 893 టన్నులకు చేరింది. 2024లో మరింత ఉత్పత్తి నమోదు కావొచ్చని అంచనా.
- రేట్ల కోతలు, ఎన్నికల ఫలితాలను బట్టి పసిడిపై తిరిగి పెట్టుబడులు పెట్టే సునిశిత కొనుగోలుదార్లు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
దేశ రాజధాని దిల్లీలో ఉబర్ సంస్థ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. ఈమేరకు లైసెన్స్ అందుకుంది. -
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
Hero MotoCorp: హీరో-హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు రానున్నాయి. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది. -
హెచ్డీఎఫ్సీ నుంచి పిక్సెల్ పే క్రెడిట్ కార్డు.. రివార్డులు మీకు నచ్చినట్టుగా..
HDFC Bank Pixel Play: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్తగా పిక్సెల్ ప్లే పేరిట కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. దీంట్లో మీకు నచ్చిన కేటగిరీని ఎంపిక చేసుకుని రివార్డు ప్రయోజనాలు అందుకోవచ్చు. -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
SBI Rewardz Fraud: తమ బ్యాంకు పేరిట వాట్సప్, ఎసెమ్మెస్ సందేశాల్లో వచ్చే లింకులపై క్లిక్ చేయొద్దని ఎస్బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. -
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
EPF auto settlement: నగదు ఉపసంహరణను సులభతరం చేయడం కోసం ఈపీఎఫ్ తీసుకొచ్చిన ఆటో సెటిల్మెంట్ సదుపాయం గురించి తెలుసా? -
టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. -
జీడీపీ వృద్ధి 6.7శాతం!
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. -
కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. -
2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్ ఫండ్లు (ఎంఎఫ్) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. -
మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి
విమాన ఇంధన (ఏటీఎఫ్) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రభుత్వాన్ని కోరింది. -
పసుపు కిందకు!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్కు మరిన్ని చిక్కులు
అగ్రగామి మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. -
చైనా స్థిరాస్తి రంగానికి ఊరట
దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. -
భారత్ వృద్ధి 6.6%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. -
సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు. -
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు