‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
సీఎం సారూ... నిధులేవండీ..!
న్యూస్టుడే, ముమ్మిడివరం: సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూర్చాల్సిఉంది. వ్యవసాయ అనుబంధశాఖల పథకాలను ‘ఆత్మ’ ద్వారా అమలు చేయాల్సిఉంది. గడిచిన ఈయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించేసింది. దీంతో అరకొర నిధులతో కార్యకలాపాలు చేపట్టాల్సిన పరిస్థితి. 2019లో ఉమ్మడి జిల్లాలో రూ.1.37 కోట్ల వ్యయంతో ఆత్మ వార్షిక ప్రణాళిక అమలైతే.. ప్రస్తుతం అది కేవలం రూ.7 లక్షలకు పడిపోయింది. అంటే ఆత్మ పథకం అమలు తీరేంటో అర్థం చేసుకోవచ్చు.
అనాస సాగు పరిశీలిస్తున్న రైతులు (పాత చిత్రం)
గతంలో ఇలా..
ఆత్మ పథకంలో గతంలో వ్యవసాయ సబ్ డివిజన్కు ఓ బీటీఎం(బ్లాక్ టెక్నికల్ మేనేజర్), ఇద్దరు ఏటీఎం(అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్)లు ఉండేవారు. వ్యవసాయ సహాయ సంచాలకుల ఆధ్వర్యంలో ఆత్మ కార్యక్రమాలు జరిగేవి. దీంట్లో పనిచేసే సిబ్బంది ఒప్పంద పద్ధతిలో పనిచేయడం, జీతాలెప్పుడొస్తాయో తెలియని పరిú్థ‡తుల్లో ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఆత్మ ప్రధాన కార్యాలయం ఉండగా.. డీపీడీ పర్యవేక్షణలో కొనసాగుతోంది. విభజిత జిల్లాలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో డీఆర్సీలను ఏర్పాటు చేసి అక్కడ డీడీఏ, ఏడీఏ, ఏవోను ఏర్పాటు చేశారు. వీరి ద్వారానే ఆత్మ కార్యకలాపాలు నిర్వహించాల్సిఉంది. అయితే నిధుల లేమితో ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు సాగడం లేదు.
ఇదివరకు సమావేశాలు జరిగేవి..
ఆత్మ ఆధ్వర్యంలో వ్యవసాయ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద రైతులకు సమావేశాలు నిర్వహించేవారు. అమలవుతున్న కార్యక్రమాలు, ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు విజ్ఞానయాత్రలకు సంబంధించి షెడ్యూలు వంటివన్నీ వివరించేవారు. ఆసక్తి ఉన్న రైతులం యాత్రలకు వెళ్లి కొత్త విషయాలు తెలుసుకునేవాళ్లం. చాన్నాళ్లుగా సమావేశాలు నిర్వహించడం మానేశారు. అసలు పథకం ఉందో, లేదో కూడా ఎవరికీ తెలియడం లేదు.
ఎం.సత్యనారాయణ, రైతు, ముమ్మిడివరం
పథకంపై పగా..
రైతులకు నిత్యం సాంకేతిక సలహాలు, శిక్షణ తరగతులు, అవగాహన కార్యక్రమాలతోపాటు సాగులో సరికొత్త పరిజ్ఞానం అందించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) జగనన్న పాలనలో అంతర్ధానమైంది. సీజన్ ప్రారంభం కాగానే రైతులను సాగుకు సమాయత్తం చేయడంలో కీలకపాత్ర పోషించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో 2005-06లో ఆత్మ పథకం తీసుకువచ్చారు.
పట్టించుకోక దగా..
వ్యవసాయం గురించి.. రైతుల మాట వచ్చిన ప్రతిసారీ రైతు సంక్షేమమే మా ధ్యేయమంటూ.. మాతోనే రైతులకు మేలు జరుగుతుందని.. బాకా మోగించే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆత్మ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. దీంతో దీని ఫలితాలు ఎవరికీ అందని పరిస్థితి నెలకొంది. నూతన వరి వంగడాల సాగు, సాంకేతికతను రైతులకు అందకుండా చేశారు.
రైతులకు విజ్ఞాన యాత్రలు..
వ్యవసాయ శాఖను అనుబంధంగా పనిచేసే ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు విజ్ఞాన యాత్రలు నిర్వహించేవారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు దిల్లీలోని ప్రగతి మైదాన్లో వ్యవసాయ క్షేత్రం, మహారాష్ట్ర, పంజాబ్లలో ఆదర్శంగా నిర్వహించే వ్యవసాయ క్షేత్రాల సందర్శనకు రైతులను తీసుకువెళ్లేవారు. అక్కడ పండిచే పంటలు, రైతులు వినియోగించే సాంకేతికత, నూతన వంగడాల గురించి తెలుసుకునేవారు. ఉద్యాన పంటలకు సంబంధించి కొబ్బరి తోటల్లో అంతర పంటలు, పాలీహౌస్లో ఆర్కిడ్స్, రాగులు, బొబ్బర్లు వంటి పంటల సాగు, ప్రకృతి వ్యవసాయ విధానాలు తెలుసుకోవడానికి ఈ యాత్రలు దోహదపడేవి. ప్రస్తుతం నిధుల కొరతతో అవన్నీ అటకెక్కాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాళ్లపూడిలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
ఉమ్మడి పార్టీల మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. -
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
[ 02-05-2024]
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
ఇసుక తోడేళ్లు..
[ 02-05-2024]
కట్టడాలకు వినియోగించే ఇసుక కోసం గుంతలు తీసి పచ్చటి బతుకులు కూల్చేశారు. యంత్రాలతో తవ్వకాలు వద్దన్నా వినరు. ప్రశాంత గోదారమ్మ గుండెల్లో పొక్లెయినర్లతో తవ్వి ఇసుక తోడేస్తారు. ఎన్జీటీ హెచ్చరించినా పట్టదు.. కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కలేనితనం. -
వైకాపా కోటలు బద్దలు కొడదాం
[ 02-05-2024]
మండపేటలో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ వైకాపా అరాచక పాలనపై ధ్వజమెత్తారు. కూటమి అభ్యర్థుల విజయం ద్వారా దీనికి చరమగీతం పాడవచ్చన్నారు. -
బాబ్బాబు.. పార్టీ మారొద్దు..
[ 02-05-2024]
నిడదవోలు వైకాపా నేతలు వరుసగా రాజీనామాలు చేసి జనసేన, తెదేపాల బాట పడుతుండటంతో ఆ పార్టీ ముఖ్య నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఉన్నవారు చేజారిపోకుండా నియోజకవర్గ నాయకుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
‘రౌడీ రాజ్యాన్ని ఓటుతో తరిమికొట్టండి’
[ 02-05-2024]
ఓటుతో రౌడీ రాజ్యాన్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎన్డీయే కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి, గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్చచౌదరి పిలుపునిచ్చారు. -
టీకాలకూ ఠికానా లేదు..!
[ 02-05-2024]
వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని.. అందరికీ మెరుగైన సేవలందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. -
నువ్వూ వద్దు.. నీ పనులూ వద్దు..
[ 02-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని జగన్మోహన్రెడ్డి వాగ్ధానాలు చేశారు. ప్రజలు నిజమేనని నమ్మి ఓటేశారు.. తీరా పీఠమెక్కిన తర్వాత బటన్ నొక్కడం తప్ప రోడ్లు బాగుచేయడం వంటి కీలక అంశాలు మరిచారు. -
భిక్షనుకున్నారా?.. కక్షగట్టారా..?
[ 02-05-2024]
నిరుపేద ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బ్యాంకు లింకేజీ, పూర్తి రాయితీ రుణాలను అందించేవారు. కిరణా దుకాణాలు, టెంటు హౌస్లు, ఆటోలు, కార్లు, వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఎస్సీలు స్వయం ఉపాధి బాటపట్టేవారు. -
రాజకీయాల్లో నేర చరితులను అడ్డుకోవాలి
[ 02-05-2024]
నేరచరిత్ర ఉన్నవారిని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో జిల్లా అభ్యదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘ఎన్నికల భారతం’ -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా..?
[ 02-05-2024]
హోం మంత్రిగా మహిళ ఉన్న రాష్ట్రంలో శాంతి, భద్రతలు లేవని, మహిళలపై హత్యలు, అత్యాచారాలకు ఎక్కువయ్యాయని గోపాలపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. -
భాజపాకు 200 సీట్లు కూడా కష్టమే
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 200 స్థానాల్లో కూడా గెలవడం కష్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. -
ఎంపీ గుట్టు బయటపెడతాం: ఆదిరెడ్డి
[ 02-05-2024]
యువతను జగన్ మోసం చేశారని కూటమి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
చర్చిలో వైకాపా నేతల ప్రచారం
[ 02-05-2024]
కాకినాడ గ్రామీణం రాయుడుపాలెం సీటీసీ చర్చిలో బుధవారం వైకాపా నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్