గాలికొదిలేశారు.. అయిదేళ్లు గడిపేశారు
పేదలే ప్రాణమంటారు. వైద్య సేవల్లో ప్రభుత్వం పెద్ద పీట వేసిందంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రగల్భాలు చెబుతారు.
వేసవివేళ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు
పేదలే ప్రాణమంటారు. వైద్య సేవల్లో ప్రభుత్వం పెద్ద పీట వేసిందంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రగల్భాలు చెబుతారు. ఆసుపత్రుల్లో మాత్రం గర్భిణులు.. చిన్నారులు.. బాలింతలు ఇలా ఎవ్వరికీ ఊపిరి ఆడనీయరు. పగలు ఎండ తీవ్రత.. రాత్రి దోమల బెడదతో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి ఫ్యాన్లు, కూలర్లు తెచ్చుకుని ఉపశమనం పొందుతున్నారు. ఇదీ వైకాపా పాలనలో పరిస్థితి.
జీజీహెచ్లోనూ పాట్లు
సర్జికల్ వార్డు-2లో తిరగని సీలింగ్ ఫ్యాన్
మసీదుసెంటర్(కాకినాడ): కాకినాడ జీజీహెచ్లోని పలు వార్డుల్లో ఫ్యాన్లు తిరగక రోగులు, సహాయకులు అవస్థలు పడుతున్నారు. మరికొన్నిచోట్ల ఫ్యాన్లు తిరుగుతున్నా గాలిరాకపోవడంతో ఇంటి నుంచి టేబుల్ ఫ్యాన్లు, విసన కర్రలు తెచ్చుకుని మంచాల వద్ద ఏర్పాటు చేసుకుంటున్నారు. మెడికల్, సర్జికల్, ఆర్థో, గైనిక్ తదితర విభాగాల్లోని పలు వార్డులో ఫ్యాన్లు తిరగడం లేదు. పలు ఐసీయూల్లో సరిపడా ఏసీలు లేకపోవడంతో రోగులు అల్లాడుతున్నారు. ఏంఐసీయూ, ఎస్ఐసీయూ, ఆర్ఐసీయూ తదితర ఐసీయూల్లో రెండు, మూడు ఏసీలు మాత్రమే ఉన్నాయి. గోడకు ఓ పక్క మాత్రమే ఏసీలు ఉండగా, మరో పక్క ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అవీ సరిగా పనిచేయడం లేదని రోగులు వాపోతున్నారు.
పనిచేయని నీటి యంత్రం
తాళ్లపూడి, న్యూస్టుడే: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అరకొర నీరే ఆధారం. వేసవిలో శీతల నీరు అందించే యంత్రాన్ని కొనుగోలు చేశారు. చల్లని నీటితో పాటు వెచ్చని నీరు సరఫరా చేసేది. దానిపై తాగునీటి డబ్బాను అమర్చుతున్నారు. ఇలా నీటి డబ్బా తెచ్చుకుంటేనే నీరు. యంత్రం సరిగా పనిచేయక ఒక్కోసారి చల్లని నీరు రావడం లేదు. పైపుద్వారా తాగునీరు సరఫరా లేదు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఫ్యాను తెచ్చుకోవాల్సిందే
ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్యాన్లతో ఉపశమనం
కడియం, న్యూస్టుడే: కడియం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఫ్యానులు నెమ్మదిగా తిరుగుతున్నాయని, గాలి ఆడక అవస్థలు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. దీంతో ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకుని వినియోగిస్తున్నామన్నారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోతే తెచ్చుకున్న పంకాలు ఆగిపోతున్నాయని, ఆసుపత్రిలో ఫ్యాన్లు తిరిగినా ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలింతలు, గర్భిణులు, చంటి పిల్లలు తీవ్ర ఉక్కపోతకు గురై అస్వస్థతకు గురవుతున్నారు.
చల్లని నీరు దూరమే
సామర్లకోట, న్యూస్టుడే: సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 300 నుంచి 400 మంది ఓపీ రోగులు వస్తుంటారు. సుమారు 35 నుంచి 50 మంది రోగులు, బాలింతలు, గర్భిణులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులు వార్డుల్లో ఎండ తీవ్రతకు ఆసుపత్రి భవనం వేడిని తట్టుకోలేక ఇళ్ల వద్ద నుంచి స్టాండు ఫ్యాన్లు తెచ్చుకుని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆసుపత్రిలో రోగులు, సహాయకుల సౌకర్యార్థం దాతలు ఇచ్చిన వాటర్ ప్యూరిఫైర్, కూలర్ మరమ్మతులకు గురికావడం, సక్రమంగా పనిచేయక పోవడంతో సిబ్బంది వేరేచోట ఉన్న వాటర్ ఫ్యూరిఫైలో నీటిని బాటిల్లో పట్టుకుని వాటర్ కూలర్లో వేస్తున్నారు.
జనరేటర్ ఉన్నా..
చాగల్లు, కొవ్వూరు పట్టణం, న్యూస్టుడే: కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో జనరేటరు ఉన్నా నిర్వహించే వారు లేకపోవడంతో కరెంటు పోతే రోగులకు ప్రయాస తప్పడం లేదు. వేసవికి తోడు కరెంటు పోతే శిశువులను ఓదార్చడానికి తల్లులు పడే అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. టార్చి వెలుగుల్లోనే వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్న తీరు ఇక్కడ దర్శనమిస్తోంది.
వేడి తట్టుకోలేక బిడ్డ కోసం ఇంటి నుంచి కూలర్ తెచ్చిన బాలింత
పేరుకే ప్రాంతీయ వైద్యశాల
తుని: తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లోను ఫ్యాన్లు లేకపోవడం, కొన్ని సరిగా తిరగకపోవడంతో ఇంటి నుంచి స్టాండు ఫ్యాన్లు తీసుకువచ్చి రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రసూతి విభాగం పైఅంతస్తులో ఉండటం, స్లాబులకు సీలింగు లేకపోవడంతో నవజాత శిశువులు, బాలింతలు తల్లడిల్లితున్నారు. కొంతమంది పడకల వద్ద ఇంటి నుంచి ఫ్యాన్లు, కూలర్లు తెచ్చుకుంటున్నారు. ట్రామాకేర్, అత్యవసర విభాగాల్లో కొన్నేళ్ల నుంచి ఏసీలు పనిచేయకపోయినా నిధులు లేవని చెబుతూ మరమ్మతులు చేయించకుండా వదిలేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్