అగ్నిసాక్షిగా.. పరిహారానికి ఎగనామం..!
అనుకోకుండా అగ్ని ప్రమాదాలతో రోడ్డునపడుతున్న కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం మొండిచేయే చూపుతోంది. బహిరంగ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పేదలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు.
కనికరం లేని సీఎం జగన్పై బాధితుల ఆగ్రహం
- న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
ఇటీవల అల్లవరం మండలం గూడాలలో కాలిపోయిన ఇళ్లు
అనుకోకుండా అగ్ని ప్రమాదాలతో రోడ్డునపడుతున్న కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం మొండిచేయే చూపుతోంది. బహిరంగ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పేదలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. పరిహారం అందించే విషయంలో సీఎం జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. కట్టుబట్టలతో మిగిలినవారిపై పాలకులకు కనికరం కలగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క పైసా ఇవ్వలేదు..
గత ప్రభుత్వ హయాంలో అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సాయంగా 20 కేజీల బియ్యం ఇచ్చేవారు. తరువాత ఇల్లు పూర్తిగా దగ్ధమైతే ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు, పాక్షికంగా దెబ్బతిన్నవారికి రూ.3 వేల చొప్పున పరిహారం అందించేవారు. వైకాపా అధికారం చేపట్టాక ఈ అయిదేళ్లుగా బాధితులకు ఒక్క పైసాకూడా పరిహారం ఇవ్వలేదు.
దాతల సాయమే దిక్కు..
అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా గడిచిన అయిదేళ్లుగా అగ్ని ప్రమాదాల్లో ఇళ్లు, వస్తువులు, దాచుకున్న సొమ్ము, ఇతర వస్తువులు కాలి బూడిదైన వారికి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అందలేదు. వారి దీనస్థితిని చూసి దాతలు కరుణించి అందిస్తున్న సాయం మాత్రమే దిక్కవుతోంది. కానీ రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టిన తరువాత వీరికి కనీసం కేజీ బియ్యం కూడా అందించని పరిస్థితి నెలకొంది. ఇక నగదు ఏమిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అగ్నిప్రమాద బాధితులు వివిధ రకాల స్వచ్ఛంద సేవాసంస్థలు, దాతల అందించే సాయంకోసం దీనంగా ఎదురుచూడాల్సిన దుస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా పూరి గుడిసెలు లేకుండా పక్కా గృహాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఆర్భాటంగా చెప్పారని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జగనన్న లేఔట్లలో ఇళ్లుకాదు, ఊళ్లు నిర్మిస్తామని బీరాలు పలికి ఆచరణలోకి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. వీటిలో ఇళ్లు నిర్మించుకునేందుకు పూర్తి స్థాయి మౌలిక వసతులు లేకపోవడంతో ఇంకా వేల కుటుంబాలవారు పూరి గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. విద్యుదాఘాతం, వంట చేసే సమయంలో, ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పేదలు నిరాశ్రయులవుతున్నారు. అయినప్పటికీ వారిపై వైకాపా ప్రభుత్వానికి దయ కలగడం లేదు.
వెబ్సైట్ మూసివేత..
రెవెన్యూ కార్యాలయాల్లో మండలాల వారీగా అగ్నిప్రమాద బాధితుల వివరాలు నమోదు చేసే వెబ్సైట్ను కూడా 2020 నుంచి మూసివేశారు. దీంతో మండలాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కేవలం రెవెన్యూ అధికారులు వెళ్లి పరామర్శిస్తున్నారంతే. బాధితులు పరిహారానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది వైకాపా ప్రభుత్వం. పథకాలకు రూ.లక్షల కోట్లు విడుదల చేసేందుకు బటన్ నొక్కానని చెప్పుకొనే ముఖ్యమంత్రి అగ్ని ప్రమాద బాధితులకు రూ.5 వేలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని పలువురు వాపోతున్నారు.
అయిదేళ్లలో జిల్లాలో అగ్ని ప్రమాదాలు 1,755
అధికారుల వివరాల ప్రకారం ఆస్తి నష్టం రూ.75.78 కోట్లు
2019 నుంచి 2024 వరకు బకాయి పరిహారం సుమారు రూ.60 లక్షలు
ప్రభుత్వం నుంచి అందిన పరిహారం 0
నిరాశ్రయులైన కుటుంబాల సంఖ్య(దాదాపు) 2,000
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..