అధర్మకర్తల మండలి
జగనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి.
వైకాపా పాలనలో ఆలయాల్లో ఇదీ పరిస్థితి
పునరావాస కేంద్రాలుగా ఆలయ పాలకవర్గాలు
న్యూస్టుడే, అన్నవరం
ధర్మకర్తగా నా విద్యుక్త ధర్మాన్ని యోగ్యంగా.. నమ్మకంగా.. శక్తివంచన లేకుండా న్యాయదృష్టితో.. జ్ఞాన విధేయంగా.. భయాభిమాన, రాగద్వేష రహితంగా.. దేవస్థానం శ్రేయస్సు దృష్ట్యా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నా..
దేవాలయాల పాలక మండలి సభ్యులు ప్రమాణం స్వీకారం సమయంలో చెప్పే మాటలివి.
జగనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. సభ్యులకు తోడు ప్రత్యేక ఆహ్వానితులంటూ నచ్చినవారిని నియమించడమే ఇందుకు నిదర్శనం.
తెదేపా హయాంలో..: పాలక వర్గాల నియామకానికి ముందుగా ప్రకటన విడుదల చేసేవారు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి సహాయ కమిషనర్ కార్యాలయం ద్వారా పోలీస్ శాఖ నుంచి దరఖాస్తుదారుల వివరాలు తెలుసుకునేవారు. ఆ తర్వాత సభ్యుల నియామకానికి ఉత్తర్వులు వచ్చేవి. 2017 మేలో అన్నవరం దేవస్థానానికి 16 మంది సభ్యులను నియమించారు. దీనికి గానూ 100 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
వైకాపా వచ్చాక..: ప్రభుత్వమే నేరుగా పాలకవర్గాలను నియమించేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ప్రకటన లేకుండా.. సభ్యుల గత చరిత్ర పరిశీలించకుండా 2020, 2023 అన్నవరం ఆలయానికి పాలక వర్గాలను నియమించారు. గత ఏడాది హడావుడిగా ఒక్కరోజులోనే ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు దేవాదాయశాఖ మంత్రి అనుయాయులైన ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.
నిధులనూ రాబట్టలేకపోయారు: కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్ ద్వారా దేవస్థానానికి నిధులు తీసుకురావడంలో ధర్మకర్తల పాత్ర శూన్యం. పలు అభివృద్ధి పనులకు రూ.54.62 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏళ్లతరబడి కదలిక కనిపించడం లేదు. ఇటీవల రూ.20 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది.
వచ్చామా.. వెళ్లామా: గత అయిదేళ్లలో రెండు పాలక వర్గాల తీరు వచ్చామా.. వెళ్లామా అన్నట్లుంది. అన్నవరంలో అభివృద్ధి పనుల పేరిట కొండపై విధ్వంసం చేసి రూ.కోట్లు వృథా చేసినా చూసీచూడనట్లు వ్యవహరించారు. తెదేపా హయాంలో ధర్మకర్తల మండలి సభ్యులు పలు పనులపై అభ్యంతరం వ్యక్తం చేసి సొమ్ము వృథాకానివ్వలేదు.
స్వప్రయోజనాలకే..: ‘మా వాళ్లు వస్తే వసతి గది ఇమ్మంటే మన వాళ్లు ఇవ్వలేదు. దర్శనానికి పంపలేదు.. మాకు గౌరవం ఇవ్వలేదు.’ ఇలాంటి అంశాలను మాత్రం ప్రస్తావించేవారే ఎక్కువ. ప్రస్తుత ధర్మకర్తల మండలిలో సభ్యుడొకరు బదిలీపై వెళ్లిన గత అధికారి హయాంలో అంతా తానై వ్యవహరించారు.
దాతలు: పాలకవర్గ సభ్యుల్లో ఇద్దరు దాతలకు తెదేపా హయాంలో ప్రాధాన్యమిచ్చేవారు. 2017 ఇలా నియమించినవారిలో ఇద్దరు పారిశ్రామిక వేత్తలు భక్తులకు సౌకర్యాలు కల్పించేలా, ఆలయాభివృద్ధికి వీరు రూ.కోట్లు ఖర్చుచేశారు. వైకాపా హయాంలో నియమించిన సభ్యుల్లో ఇటువంటి వారికి ప్రాధాన్యమివ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.