కొందరికే పోస్టల్ బ్యాలెట్..
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కొందరు ఉద్యోగులకు దక్కడంలేదు. ఫారం-12 సమర్పించినా జాబితాలో పేర్లు లేకపోవడంతో రెండోరోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది.
న్యూస్టుడే, వి.ఎల్.పురం, దేవీచౌక్ (రాజమహేంద్రవరం): పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కొందరు ఉద్యోగులకు దక్కడంలేదు. ఫారం-12 సమర్పించినా జాబితాలో పేర్లు లేకపోవడంతో రెండోరోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో మంగళవారం పోలీసు సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్ విధుల్లో భాగస్వాములయ్యే ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. జాబితాలో పేర్లులేక కొందరు.. తాము ఎక్కడ ఓటు వేయాలనే దానిపై స్పష్టమైన సమాచారంలేక ఇంకొందరు ఇబ్బంది పడ్డారు. మరికొందరు అక్కడే మళ్లీ ఫారం-12 పూర్తిచేసి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకొందరికి ఆ అవకాశం కూడా లేక వెనుదిరిగారు.
రెండోరోజూ అవే సమస్యలు
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని బుద్ధభవన్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉదయం 9 గంటల నుంచి పోలీసు సిబ్బంది, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసు సిబ్బందిలో చాలామంది పేర్లు జాబితాలో లేవు. ఇదివరకే ఆయా పోలీస్స్టేషన్ల నుంచి ఫారం-12 దరఖాస్తులు ఆర్వోలకు పంపించినప్పటికీ కొందరికే బ్యాలెట్ వచ్చిందని చెబుతున్నారు. వర్షం కారణంగా గంటన్నర పాటు ప్రక్రియ నిలిపివేశారు.
కావాలనే చేస్తున్నారా..
ఇతర జిల్లాల్లో ఓటు ఉండి ఇక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసులు, కొందరు మైక్రోఅబ్జర్వర్లకు పోస్టల్ బ్యాలెట్ రాలేదు. ఆయా నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాలకు వచ్చి పరిశీలించుకోగా జాబితాలో పేర్లు లేకపోవడంతో మళ్లీ ఫారం-12 సమర్పించాల్సి వచ్చింది. పోలీసు సిబ్బందికి మాత్రం ఆ అవకాశం కూడా లేకుండాపోయింది. కావాలనే గందరగోళం సృష్టించి ఓటు వినియోగించుకోకుండా చేస్తున్నారని వారంతా ఆరోపిస్తున్నారు.
వైకాపా నాయకుల ప్రలోభాలు
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వచ్చిన వారిని వైకాపా నాయకులు ప్రలోభాలకు గురిచేశారు. గేటు బయట నిలబడి తమకు ఓటేస్తే డబ్బులు పోన్పే చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఓటుకు రూ.3 వేల చొప్పున ఇచ్చేందుకు సిద్ధపడినప్పటికీ కొందరు సున్నితంగా తిరస్కరించారు.
రాజమహేంద్రవరం: పోస్టల్
బ్యాలెట్ వినియోగించుకునేందుకు క్యూలో పోలీసు సిబ్బంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో