మృతుల కుటుంబాల రోదన జగన్ చెవికెక్కని వేదన
మృతుల కుటుంబాలపైనా ముఖ్యమంత్రి జగన్ దయ చూపలేదు. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఎస్ఆర్ బీమా పథకం బాధిత కుటుంబాలకు ఆసరా కల్పించలేకపోయింది. దురదృష్టవశాత్తూ సాధారణ, ప్రమాద మరణాలు పొందిన వారి కుటుంబాలకు సకాలంలో బీమా పరిహారం చెల్లించకుండా నరకం చూపించారు.
వైఎస్ఆర్ బీమాపథకం అర్హుల కుదింపు
బాధిత కుటుంబాలకు సకాలంలో అందని సాయం
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్: మృతుల కుటుంబాలపైనా ముఖ్యమంత్రి జగన్ దయ చూపలేదు. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఎస్ఆర్ బీమా పథకం బాధిత కుటుంబాలకు ఆసరా కల్పించలేకపోయింది. దురదృష్టవశాత్తూ సాధారణ, ప్రమాద మరణాలు పొందిన వారి కుటుంబాలకు సకాలంలో బీమా పరిహారం చెల్లించకుండా నరకం చూపించారు.
తెదేపాలో బాధితులకు అండగా..
తెదేపా ప్రభుత్వంలో 2014-19 మధ్య చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేశారు. 18 ఏళ్లు దాటిని కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఈ పథకాన్ని వర్తింప చేశారు. 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు వ్యక్తులు సాధారణ మరణం పొందితే రూ.2 లక్షలు బీమా పరిహారం ఇచ్చేవారు. పెద్ద కర్మ రోజునే ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందించేవారు. ప్రమాద మరణాలకు రూ.5 లక్షలు ఇచ్చేవారు. ఈ సాయాన్ని బాధిత కుటుంబానికి సకాలంలో అందజేసి ఆసరా కల్పించేవారు. 18 -70 ఏళ్ల వయసు వారికి ప్రమాద బీమా వర్తింప చేసేవారు. ఈ పథకాన్ని ఎంతో విజయవంతంగా అమలు చేసి పేద కుటుంబాలకు తెదేపా ప్రభుత్వం అండగా నిలిచింది.
వైకాపా ప్రభుత్వంలో కోతలు..
జగన్ ప్రభుత్వం వచ్చాక సాధారణ మరణం పరిహారాన్ని రూ..లక్షకు కుందించింది. కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేశారు. అయిదేళ్లు ఏటా ఈ పథకం రెన్యువల్ పేరుతో కాలయాపన చేయడంతో బాధిత కుటుంబాలకు పరిహారం జారీలో తీవ్ర జాప్యం జరిగింది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఎస్ఆర్ బీమా పథకం అమలు ప్రహసనంగా మారింది.
ప్రీమియం చెల్లింపులోనూ నిర్లక్ష్యం..
ఏటా జులై ఒకటి నుంచి వచ్చే జూన్ 30 వరకే ఈ పథకాన్ని వర్తింప చేసేవారు. మళ్లీ రెన్యువల్ అయితేనే కొనసాగేది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో నాలుగు నెలలపాటు బీమా పథకానికి ప్రీమియం చెల్లించలేదు. ఈ నాలుగు నెలల కాలంలో మరణించిన వ్యక్తుల వివరాలను ఆన్లైన్ చేయలేదు. ఇలా వందల మంది జిల్లాలో నష్టపోయారు. వీరంతా డీఆర్డీఏ కార్యాలయం, వైకాపా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఆ కుటుంబాలకు ఇప్పటికీ మేలు జరగలేదు.
పరిహారానికి ఎడతెగని నిరీక్షణ..
కాకినాడ జిల్లాలోని 21 మండలాల పరిధిలో 2023 జులై నుంచి వైఎస్ఆర్ బీమా పథకాన్ని పునరుద్ధరించారు. అప్పటి నుంచి మార్చి 16 వరకు జిల్లాలో 1,073 సాధారణ మరణాలు సంభవించాయి. వీటిలో 1066 క్లెయిమ్లు ఆన్లైన్ చేశారు. వీరిలో 1,011 మందికి పరిహారం మంజూరు చేశారు. 86 ప్రమాద మరణాలు సంభవించాయి. సాధారణ మరణాలకు జులై నుంచి మార్చి వరకు ఒక్క బాధిత కుటుంబానికీ బీమా పరిహారం చెల్లించలేదు. ఎన్నికల కోడ్ రాక ముందు వీటికి నిధులు మంజూరు చేశారు. జులై నుంచి మార్చి వరకు పైసా పరిహారం ఇవ్వలేదు. చివరిలో హడావుడిగా నిధులిచ్చారు.
ప్రస్తుతం ఆన్లైన్ నమోదు నిలిపివేత
ఎన్నికల కోడ్ రావడంతో ప్రస్తుతం వైఎస్ఆర్ బీమా పథకంలో ఆన్లైన్ నమోదును నిలిపివేశారు. మార్చి 16 నుంచి వీటికి సంబంధించిన కార్యకలాపాలు ఆగిపోయాయి. సాధారణ, ప్రమాద మరణాల వివరాలను ఆయా గ్రామ/వార్డు సచివాలయాల్లో నమోదు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ బీమా కార్యాలయానికి వివరాలు పంపించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ అసంతృప్తి
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్