ఆయుష్ తీసేసిన జగన్!
ప్రతి పీహెచ్సీ పరిధిలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హోమియో, ఆయుర్వేదం, యునాని విభాగాల్లో ఏదో ఒక దానిని ఏర్పాటు చేసి గతంలో వైద్యులు, సిబ్బందిని నియమించారు.
న్యూస్టుడే, మామిడికుదురు, పి.గన్నవరం : ప్రతి పీహెచ్సీ పరిధిలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హోమియో, ఆయుర్వేదం, యునాని విభాగాల్లో ఏదో ఒక దానిని ఏర్పాటు చేసి గతంలో వైద్యులు, సిబ్బందిని నియమించారు. వైద్యులు, మందులు ఉండడం వల్ల ప్రతి రోజూ దాదాపు 40 నుంచి 50 మంది వరకు అక్కడికి ఆయా రోగులు వచ్చి వైద్య సేవలను వినియోగించుకునే వారు. కాలక్రమేణా వైద్యులు లేకపోవడం, ఇన్ఛార్జిల నియామకాలతోనే సరిపెట్టడం, అందులో పనిచేసే తాత్కాలిక సిబ్బందే వైద్యం, మందులు అందజేస్తూ వచ్చారు. ఆయుష్ శాఖకు 2014-15 నుంచి 2019-20 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.145 కోట్లు కేటాయించాయి. అందులో ఉన్న రూ.65 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వీటికి వ్యయం చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించింది. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు గత రెండేళ్లుగా నిలిచిపోవడంతో ఆయా ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 13 హోమియో, 9 ఆయుర్వేదం, ఒక యునానికి సంబంధించి 23 ఆసుపత్రుల్లో రెండు మూడు చోట్ల మినహా మిగతా అన్ని చోట్లా వైద్యులు లేరు. సిబ్బందితోనే వాటిని ఎలాగొలా నిర్వహించేస్తున్నారు. జిల్లాలో ఒక్కో భవనానికి రూ.3.50 లక్షల వ్యయంతో ఆధునికీకరణ చేయాలని గత ఏడాది ప్రతిపాదనలు చేసినా అమలుకు నోచుకోలేదు.
ఏళ్ల కాలంగా ఎంతో మందికి దీర్ఘకాలిక, మొండి రోగాల నయానికి ఉపయోగపడిన ఆయుర్వేదం, హోమియో, యునాని ఆసుపత్రులపై వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో వాటి ప్రాధాన్యం దాదాపు తగ్గిపోయింది. ఆయుష్ శాఖలో నడుస్తున్న వీటికి గత ఏడాది కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా మళ్లించేయడంతో అవి మరింత నిర్వీర్యంగా మారిపోయాయి. కొన్ని చోట్ల సిబ్బందితో, చాలీచాలని మందులతో నామమాత్రంగా ఇవి నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఈ ఆసుపత్రులు పూర్తిగా మూతపడ్డాయి.
జగన్ నిర్లక్ష్యానికి కొన్ని సాక్ష్యాలు ఇవే...
- మామిడికుదురు మండలం పాశర్లపూడిలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహించిన భవనం పూర్తిగా శిథిలమైంది. దీంతో రెండున్నరేళ్లుగా ఇది పూర్తిగా మూతపడిపోయింది.
- రాజోలు మండలం తాటిపాకలోని ఆయుర్వేద ఆసుపత్రికి వైద్యుడ్ని నియమించినా వేరే చోటకు ప్రతినియుక్తి చేయడం, అక్కడి భవనం శిథిలావస్థకు చేరడంతో ఆసుపత్రికి సంబంధించిన సేవలు అందకుండా పోయాయి.
- పి.గన్నవరం మండలం నరేంద్రపురంలోని ఆయుర్వేద ఆసుపత్రిలో ఏళ్ల కాలంగా వైద్యుడు, సహాయకుడు లేరు. నిత్యం 40 మంది వరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే రోగులు ఆయుర్వేద వైద్యానికి దూరమయ్యారు.
- నగరం పీహెచ్సీకి చెందిన పాత భవనంలో యునాని ఆసుపత్రి ఉన్నా గత రెండున్నరేళ్లుగా ఇక్కడ వైద్యుడు లేరు. సహాయకురాలే వచ్చిన వారికి ఉన్నంత మేరకు మందులు ఇస్తున్నారు. అవసరాల మేరకు మందులు ఉండకపోవడం, వైద్యుడు లేకపోవడంతో అక్కడికి వచ్చే వారు పూర్తిగా తగ్గిపోయారు.
దృష్టిసారించకపోవడం తగదు
ఆయుష్ శాఖ ఆధ్వర్యంలోని ఆసుపత్రులను సక్రమంగా నిర్వహించకపోవడంతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. నగరంలో యునాని ఆసుపత్రి ఉన్నా అక్కడ ఏళ్లకాలంగా వైద్యుడు పోస్టు భర్తీ చేయడం లేదు. మందులు కూడా అరకొరగానే ఉంటున్నాయి. దీంతో అక్కడికి వైద్యానికి వెళ్లే వారు బాగా తగ్గిపోయారు. వీటిని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.
మీర్ అబ్రార్హుస్సేన్, విశ్రాంత ఉద్యోగి, నగరం
అన్ని చోట్లా వైద్యులను నియమించాలి
హోమియో, ఆయుర్వేదం, యునాని ఆసుపత్రులకు సంబంధించి వైద్యులు లేకపోవడంతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. వీటి విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిన కారణంగా ఆయా ఆసుపత్రుల పరిస్థితి నిరుపయోగంగా మారింది. భవనాలకు ఆధునికీకరణ సైతం కొరవడడంతో ఇబ్బందికరంగా ఉన్నాయి. పలు చోట్ల వీటిని మూసివేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం.
గాలిదేవర సత్యనారాయణ, పాశర్లపూడి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!