ఓట్ల కోసం నోట్ల వల
తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైకాపా నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లను రాబట్టుకునేందుకు ఇప్పటివరకు ఓటర్లను రకరకాలుగా ప్రలోభపెడుతూ వచ్చారు.
డబ్బు పంపిణీకి వైకాపా సిద్ధం
న్యూస్టుడే, వి.ఎల్.పురం, కంబాల చెరువు: తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైకాపా నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లను రాబట్టుకునేందుకు ఇప్పటివరకు ఓటర్లను రకరకాలుగా ప్రలోభపెడుతూ వచ్చారు. ముందస్తు వ్యూహరచన మేరకు ఇప్పటికే ఆయా డివిజన్లలో మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేయడంతో పాటు వివిధ వర్గాల వారికి, కులసంఘాల నాయకులకు తాయిలాలు అందించారు. ఆత్మీయ సమావేశాల పేరిట వివిధ కులసంఘాలతో సమావేశాలు నిర్వహించి విందు భోజనాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు.
పోలింగ్ దగ్గర పడటంతో..
పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో నోట్లతో ఓట్ల కొనుగోలుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. హోం ఓటర్లను కూడా వదలకుండా ఇటీవల ఓటుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేసిన వైకాపా నాయకులు ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ వేసే ఉద్యోగులను సైతం ప్రలోభాలకు గురిచేసినట్లు సమాచారం.
డివిజన్ల వారీగా..
ఈ నెల 13న ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లందరికీ డివిజన్ల వారీగా డబ్బుల పంపిణీకి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కొక్క ఓటుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించగా అవసరమైతే తెదేపాకు అనుకూలంగా ఉన్న ఓటర్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అందించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నెల 12 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి కార్యాలయం నుంచి ఓటర్లకు ఫోన్లుచేసి వివరాలు, అదే చిరునామాలో ఉన్నారా? లేదా? అనేవి తెలుసుకుంటున్నారు.
బుధవారం రాత్రి వరకు హడావుడి: కొన్ని శివారు డివిజన్లలో బుధవారం రాత్రి 11 గంటలు దాటినా డబ్బుల పంపిణీ ఆగలేదు. ఒక్కో వార్డులో పదేసి మంది యువకులు, స్థానిక నాయకులతో కలిసి జల్లెడేసి మరీ రూ.2500-3000 వరకు ఇస్తున్నారు. జాబితాలో పేరు, ఓటరు స్లిప్పు నంబరును పరిశీలించుకుని బహిరంగంగానే డబ్బులు పంచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాన్ని రికార్డు చేయొద్దని స్టార్ స్పోర్ట్స్ను కోరినా.. ప్రసారం చేసింది : రోహిత్ అసంతృప్తి
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్