రూ.70 లక్షలు తీసుకొని మోసం చేశాడు
ఓ వ్యక్తి భూములు కొనుగోలు చేస్తానని తన వద్ద రూ.70 లక్షలు తీసుకున్నాడు...ఆ తరువాత తన ఫోన్ బ్లాక్ చేశాడు...తాను మోసపోయానని..న్యాయం చేయాలని తాడికొండకు చెందిన ఒకరు రూరల్ ఎస్పీ విశాల్గున్నీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ
‘డయల్ యువర్ ఎస్పీ’లో ఫిర్యాదు
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే : ఓ వ్యక్తి భూములు కొనుగోలు చేస్తానని తన వద్ద రూ.70 లక్షలు తీసుకున్నాడు...ఆ తరువాత తన ఫోన్ బ్లాక్ చేశాడు...తాను మోసపోయానని..న్యాయం చేయాలని తాడికొండకు చెందిన ఒకరు రూరల్ ఎస్పీ విశాల్గున్నీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ తాడికొండ అర్బన్ పరిధిలో ఉన్నదని...అక్కడి ఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ స్పందించారు. ఫిర్యాదులు ఇలా ఉన్నాయి.
* వినుకొండకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ తన 10 ఎకరాల పొలంలో జామ, జామాయిల్ తోట వేశానని, ఓ వ్యక్తి తన తోటలను నరికివేశాడని వాపోయాడు. దీనిపై ఎస్పీ స్థలం పత్రాలు తీసుకు వెళ్లి సీఐని కలిస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారన్నారు.
* కర్లపాలేనికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ తాము రొయ్యల వ్యాపారం చేస్తుంటామని, తమ వద్ద ఓ వ్యక్తి సరకు తీసుకొని రూ.28.50 లక్షలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. స్పందించిన ఎస్పీ వారి వద్ద ఫిర్యాదు తీసుకొని వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
* సత్తెనపల్లికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ తన వద్ద ఓ మహిళ బ్యాంకులో తాకట్టు పెడతానంటూ రూ.10 సవర్ల బంగారం, అర కిలో వెండి తీసుకొని ఇబ్బంది పెడుతోందని వాపోయింది. దీనిపై ఎస్పీ అక్కడ పోలీసులతో మాట్లాడితే ఆమె వ్యక్తిగత కక్షతో తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. మరోసారి విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి దొంగల గెండెళ్లో రైళ్లు
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.