పాపం.. ఆ పిల్లలు వైద్యానికి దూరమయ్యారు!
నిరుపేద కుటుంబంలో జన్మించిన విద్యార్థులు తల్లిదండ్రుల ఆప్యాయత, అనురాగానికి దూరంగా ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంటున్న వీరికి ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి,
మూడేళ్లుగా నిలిచిన ఆరోగ్యకార్డుల పంపిణీ
పొన్నూరు, న్యూస్టుడే
పెదనందిపాడు మండలం, అన్నపర్రు బీసీ వసతిగృహంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు
నిరుపేద కుటుంబంలో జన్మించిన విద్యార్థులు తల్లిదండ్రుల ఆప్యాయత, అనురాగానికి దూరంగా ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంటున్న వీరికి ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అందుకు సంబంధించిన వివరాలను ఆరోగ్యకార్డులో నమోదు చేయాల్సి ఉంది. గత మూడేళ్లుగా ఆ కార్డుల పంపిణీ అటకెక్కింది. వసతిగృహాల్లోని విద్యార్థుల నాడి పట్టే నాథుడే కన్పించడంలేదు. జిల్లాలో గుంటూరు, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో వెనుకబడిన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే వసతిగృహాలు 30 వరకూ ఉన్నాయి. వీటిలో సుమారు 2 వేల మంది దాకా విద్యార్థులున్నారు.
* 2018 - 2019 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వీరికి ఆరోగ్య కార్డులను పంపిణీ చేసింది. 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో ఇవ్వలేదు. కరోనా వైరస్ కారణంగా రెండేళ్ల పాటు వసతిగృహాల తలుపులు మూతబడ్డాయి. కొవిడ్ కేసులు తగ్గు ముఖం పట్టిన తర్వాతే ఇవి తెరుచుకున్నాయి.
* వసతిగృహాలను సందర్శించే వైద్యులు ప్రతి నెల విద్యార్థుల ఎత్తు, బరువు, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే అస్వస్థతకు కారణం, ఆసుపత్రికి పంపిన తేదీ, చికిత్సకు వాడిన మందులు తదితర వివరాలను కూడా ఆరోగ్యకార్డుల్లో పొందుపరచాల్సి ఉంది. అన్ని హాస్టళ్లను పునఃప్రారంభించి నెల గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు వైద్యులు విద్యార్థుల నాడి పట్టలేదు. కొన్ని చోట్ల ఆరోగ్య సిబ్బంది వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు కానీ.. ఆ వివరాలు నమోదు చేసేందుకు కార్డులు అందుబాటులో లేకపోవడంతో వివరాల నమోదు ప్రక్రియను పక్కన పెట్టారు. ప్రస్తుతం అనేక చోట్ల వసతిగృహాల్లో ఉంటున్న పిల్లలు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో వారే మెడికల్ స్టోర్కు వెళ్లి ఏవో మందులు తీసుకొచ్చి వాడుకొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆరోగ్యకార్డులు పంపిణీ చేయడంతో పాటు.. వసతిగృహ విద్యార్థులకు రెగ్యులర్గా వైద్యపరీక్షలు చేసేలా సిబ్బందిని పురమాయించాల్సి ఉంది.
గత ప్రభుత్వం పంపిణీ
చేసిన ఆరోగ్య కార్డు : త్వరలో అందిస్తాం
బీసీ వసతిగృహాల్లోని విద్యార్థులకు ఇప్పటివరకు ఆరోగ్యకార్డులు అందించలేదు. అయితే వీలైనంత త్వరగా వాటిని అందిస్తాం.
- నరసారెడ్డి, జిల్లా అధికారి, బీసీ సంక్షేమశాఖ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?