చిరుధాన్యాలు.. సిరులు
పల్నాడులో సాగర్ జలాలు రాక ముందు ఇక్కడ ప్రజలకు చిరుధాన్యాలే ప్రధాన ఆహారం.
పోషక విలువ ఆహారంతో ఆరోగ్యం
జిల్లాలో 1400 హెక్టార్లలో సాగు లక్ష్యం
న్యూస్టుడే, నరసరావుపేట అర్బన్, నరసరావుపేట టౌన్
పల్నాడులో సాగర్ జలాలు రాక ముందు ఇక్కడ ప్రజలకు చిరుధాన్యాలే ప్రధాన ఆహారం. కాలక్రమంలో కృష్ణమ్మ పరవళ్లతో వరి సాగు పెరిగింది. చిరుధాన్యాల సాగు కనిష్ఠ స్థాయికి పరిమితమైంది. గత కొన్నేళ్లుగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో చిరుధాన్యాల్లో అత్యధికంగా ఉండే పోషకాల గురించి ప్రజలకు అవగాహన పెరిగింది. పేదల ఆహారంగా ఉన్న రాగులు, వరిగలు, జొన్నలు, సజ్జలు నేడు ధనవంతులు ఆరోగ్య అభిలాషులకు ప్రీతిపాత్రమయ్యాయి. కొవిడ్ సమయంలో మరోసారి ఆహారంలో పోషక విలువల ప్రాధాన్యత అందరికీ తెలిసి వచ్చింది. ప్రపంచంలోనే చిరుధాన్యాల సాగు ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్రం చొరవతో 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా చిరుధాన్యాలపై అవగాహన పెంచడంతో పాటు సాగును పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో ఇలా..
జిల్లాలో వరిగలు 250 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జొన్న మరో 25 హెకార్టలో సాగు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం జిల్లా 1400 హెక్టార్లలో చిరుధాన్యాల సాగు చేయాలని లక్ష్యం విధించింది. తదనుగుణంగా అధికారులు జిల్లాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకేచోట 250 ఎకరాలు ఉండేలా చూసి క్లస్టర్గా ఏర్పాటు చేసి సాగు చేయించాలన్నది అధికారుల ఆలోచన.
ప్రోత్సాహకాలు..
చిరుధాన్యాల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. రైతుకు రూ.6వేల చొప్పున ప్రోత్సాహం ప్రభుత్వం ఇస్తోంది. విత్తనాలు, ఎరువులు తదితర వ్యవసాయ అవసరాలకు వీటిని వినియోగించుకునే వీలుంది. చిరుధాన్యాలకు కనీస మద్దతు ధరలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. క్వింటాకు రూ.2500 చెల్లిస్తారు. పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు చిరుధాన్యాలతో వండి వడ్డించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పౌరసరఫరాలశాఖ చిరుధాన్యాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి.
ఆదాయం మిన్న
వరి, మిర్చి, పత్తి ఏ పంట సాగు చేసినా ఎక్కువ పెట్టుబడి అవుతోంది. అదే చిరుధాన్యాల్లో గరిష్ఠంగా 15వేలకు మించి కాదు. ఆదాయం తీసుకుంటే మార్కెట్ ధరలు, వాతావరణ పరిస్థితులు, వచ్చిన దిగుబడి ఆధారంగా ఉంటుంది. ఈఏడాది పరిశీలిస్తే ఎకరాకు రూ.2లక్షల వ్యయం చేసి మిర్చి సాగు చేసిన రైతుకు నాలుగు లక్షలు ఆదాయం లభించినట్లు అంచనా అదే. చిరుధాన్యాలను పరిశీలిస్తే కచ్చితంగా రూ.30వేలకు వరకూ ఆదాయం లభించింది. పైగా సాగులో సమస్యలు తక్కువ. తక్కువ నీటితో సాగు చేయవచ్చు. తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మిగిలిన పంటలపై వాతావరణం, తెగుళ్ల ప్రభావం అధికంగా ఉంటుంది.
రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
రైతులకు అవగాహన పెంచుతున్నాం
జిల్లాలో 1400 హెక్టార్లలో చిరుధాన్యాల సాగుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇతర పంటల మాదిరిగా కాకుండా పంటను పూర్తిగా కొనేందుకు అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడి, నష్ట భయం లేకుండా సాగు చేయాలన్న లక్ష్యంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అంతే కాకుండా చిరుధాన్యాల ఆధారిత పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది.
మురళి, జిల్లా వ్యవసాయాధికారి, నరసరావుపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?