మాటల్లో గారడీ.. చేతల్లో బురిడీ..
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బ్యాంకులకు రుణాలు కట్టొదు. మన ప్రభుత్వం రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తాం.. వడ్డీలేని రుణాలిస్తాం.. స్వయం ఉపాధి శిక్షణ ఇస్తాం..
డ్వాక్రా మహిళలకు చేసిందేమిటి జగన్
బటన్ నొక్కినా ఖాతాల్లో జమ కాని ఆసరా నగదు
న్యూస్టుడే, సత్తెనపల్లి
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బ్యాంకులకు రుణాలు కట్టొదు. మన ప్రభుత్వం రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తాం.. వడ్డీలేని రుణాలిస్తాం.. స్వయం ఉపాధి శిక్షణ ఇస్తాం.. మీ పిల్లల చదువుకు, కుటుంబానికి ఆర్థిక, సామాజిక భరోసా ఇస్తామంటూ మాయమాటలతో జగన్ నమ్మించారు. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ విషయంలో మడత పేచీ పెట్టారు. సీఎం అయ్యేరోజుకు ఉన్న రుణాల్ని మాఫీ చేయకుండా 2019 ఏప్రిల్ 11వరకు ఉన్న రుణాలు మాత్రమే చెల్లించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల అభ్యున్నతికి కొత్తగా ఒక్క పథకం అమలు చేసింది లేదు.
స్వయం ఉపాధి శిక్షణ ఏదీ..?
డ్వాక్రా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా తెదేపా ప్రభుత్వం పట్టణాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ద్వారా స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇప్పించింది. టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారు. ఒక్కో పట్టణంలో ఏటా 300 నుంచి 400 మంది, మండలాల్లో 200 నుంచి 300 మంది స్వయం ఉపాధి శిక్షణ పొంది ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వైకాపా డ్వాక్రా మహిళల స్వయం ఉపాధిని ఎప్పుడో మరిచిపోయింది. ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క స్వయం ఉపాధి శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.
సున్నా వడ్డీ.. ఉత్తదే..
నా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలిస్తానని జగన్ గొప్పగా గత ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నవరత్నాల్లో వైఎస్ఆర్ సున్నావడ్డీని ఒకటిగా చేర్చినా సక్రమంగా అందించలేకపోయారు. రుణం తీసుకున్నప్పుడు వడ్డీలేని విధంగా రుణాలివ్వకుండా ఏడాదికి ఒకసారి బటన్ నొక్కే విధానం పెట్టారు. సున్నావడ్డీ అర్హతకు ఎన్నో ఆంక్షలు పెట్టారు. దీంతో చాలా సంఘాలు, సభ్యులు సున్నా వడ్డీకి దూరమయ్యాయి. గతేడాది ఆగస్టులో జిల్లా వ్యాప్తంగా 41,400 సంఘాల్లోని 4,14,910 మందికి రూ.58.02 కోట్ల సున్నా వడ్డీ లబ్ధికి బటన్ నొక్కినా ఇప్పటికీ వేలాది సంఘాలకు లబ్ధి జమ కాలేదు. దీనికి సాంకేతిక కారణాలు, ఖాతాల్లో తప్పులంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు.
వెలుగుచూసిన అవకతవకలు
డ్వాక్రా సంఘాలకు రుణాల పంపిణీతోపాటు సమాఖ్యల నిర్వహణలో చాలాచోట్ల అవకతవకలు బయటపడ్డాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం వెళ్లిన మంత్రి అంబటితో బ్యాంకు లింకేజి రుణానికి రూ.లక్షకు రూ.2 వేలు లంచంగా తీసుకుంటున్నారని డ్వాక్రా మహిళ ప్రశ్నించింది. చాలాచోట్ల ఇవే ఫిర్యాదులు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వచ్చాయి. ఉద్యోగులు, గౌరవ వేతనంపై పనిచేసే వారు అడిగినంత ఇవ్వకుంటే రుణం నిలిపేసి ఇబ్బందులు పెడతారని ఇప్పటికీ డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. సంఘాల పొదుపు నగదు అధికార పార్టీ నాయకుల సహకారంతో స్వాహా చేసిన ఘటనలు కూడా జిల్లాలో వెలుగు చూశాయి.
మహిళా సంఘాలకు భవనాల నిర్మాణమేదీ?
ఉపాధి నిధులకుతోడు స్థానిక సంస్థల భాగస్వామ్యంతో మండలాల్లో మహిళా శక్తి భవనాల్ని తెదేపా ప్రభుత్వం నిర్మించింది. దీంతో అద్దె భవనాల నుంచి వాటికి చాలాచోట్ల విముక్తి లభించింది. జగన్ పాలనలో మహిళా శక్తి భవనాల నిర్మాణం ఊసే లేకుండా పోయింది.
రుణసాయం కేంద్రానికి వదిలేసి..
డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల ద్వారా లింకేజి రుణాలు, రుణసాయం తెదేపా ప్రభుత్వ హయంలో గొప్పగా జరిగేది. ఏటా జిల్లాలోని సంఘాలకు రూ.200 నుంచి రూ.300 కోట్ల రుణ పంపిణీ లక్ష్యాన్ని నిర్దేశించి మెప్మా, సెర్ప్ అధికారులు, ఉద్యోగులను పరుగులు పెట్టించేవారు. వైకాపా ప్రభుత్వం బ్యాంకు లింకేజి రుణాలన్నీ కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టేశారు. కొవిడ్ సమయంలో కేంద్రం డ్వాక్రా సంఘాల రుణ పంపిణీ లక్ష్యాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. బ్యాంకులకు విరివిగా డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు చేసింది. దీంతో బ్యాంకులు ఆర్థిక క్రమశిక్షణ పాటించే సంఘాలకు కోరినంత రుణాలు ఇస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని అసలు సాయాన్ని ఎప్పుడో మరిచిపోయింది. ఉన్నతి పథకం కింద నిరుపేద కుటుంబాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబనకు రుణాల్ని గత ప్రభుత్వం అందజేస్తే ఈ ప్రభుత్వం మమ అనిపించింది.
జగన్ను నమ్మరు
డ్వాక్రా మహిళలకు జగన్ అరచేతిలో వైకుంఠం చూపించారు. వారి ఆశలు అడియాసలు చేశారు. ఐదేళ్లలో వారి కోసం ఒక్క పథకాన్ని ప్రత్యేకంగా అమలు చేయలేదు. డ్వాక్రా రుణమాఫీకి ఆసరా అంటూ ఉత్తుత్తి బటన్లు నొక్కారు. ఎప్పుడో జనవరిలో నొక్కిన బటన్కు ఇప్పుడు కూడా డబ్బులు ఖాతాల్లో పడలేదు. స్వయం సహాయక సంఘాలతోపాటు వాటిలోని సభ్యులకు గుర్తింపు, గౌరవం చంద్రబాబుతోనే ఉంటాయి. మరోసారి జగన్ను డ్వాక్రా మహిళలు నమ్మే పరిస్థితి లేదు.
బీమినేని వందనాదేవి, డ్వాక్రా సంఘాల రాష్ట్ర నాయకురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?
[ 18-05-2024]
కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. -
వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. -
డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
వాడరేవులో రాష్ట్ర గవర్నర్
[ 18-05-2024]
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. -
తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు
[ 18-05-2024]
ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్, ఎన్ఎస్ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. -
దయచేసి వినండి.. ధరలు అధికం
[ 18-05-2024]
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. -
ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి
[ 18-05-2024]
రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. -
పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం
[ 18-05-2024]
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. -
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి
[ 18-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. -
పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
[ 18-05-2024]
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. -
ఈవీఎంల భద్రతపై సమావేశం
[ 18-05-2024]
జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిపై వేటు పడుతుందో..
[ 18-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. -
కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
[ 18-05-2024]
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.10 లక్షల బురిడీ
[ 18-05-2024]
మాయ మాటలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. -
ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
[ 18-05-2024]
-
సినీ థియేటర్లను బతికించండి
[ 18-05-2024]
నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్