Nara Lokesh: నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలోకి భారీగా చేరికలు
గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు.
గుంటూరు: కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెదేపా అని, వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లకుపైగా నిధులు కేటాయించామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. తెదేపాకి 70 లక్షల మంది కార్యకర్తలే ఆస్తి అని, తెలుగుజాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురవేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 50 మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుభానితో పాటు దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై