logo

ఎగసిన ‘జన’ కెరటం

రేపల్లె తీర ప్రాంతానికి జనసేనాని రాకతో అభిమాన జన కెరటం ఉవ్వెత్తున ఎగసింది. చిన్నాపెద్దా తేడా లేకుండా తరలివచ్చిన జనాలతో రేపల్లె పట్టణం కిక్కిరిసింది. తెదేపా-జనసేన-భాజపా కూటమి ఆధ్వర్యంలో శనివారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు పవన్‌కల్యాణ్‌ హాజరయ్యారు.

Published : 05 May 2024 06:11 IST

రేపల్లెలో పవన్‌కల్యాణ్‌కు బ్రహ్మరథం

సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

రేపల్లె తీర ప్రాంతానికి జనసేనాని రాకతో అభిమాన జన కెరటం ఉవ్వెత్తున ఎగసింది. చిన్నాపెద్దా తేడా లేకుండా తరలివచ్చిన జనాలతో రేపల్లె పట్టణం కిక్కిరిసింది. తెదేపా-జనసేన-భాజపా కూటమి ఆధ్వర్యంలో శనివారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు పవన్‌కల్యాణ్‌ హాజరయ్యారు. జనసేనాని చూసేందుకు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లపైకెక్కి ఆసక్తిగా తిలకించారు, తొలుత పట్టణంలో రోడ్‌ షో నిర్వహించగా, దారి పొడవునా పూలుచల్లుతూ, హారతినిస్తూ జనసేనానికి ఎదురేగి స్వాగతం పలికారు. కిలోమీటర్ల కొద్దీ ప్రచారం రథం పక్కనే యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ద్విచక్ర వాహన ర్యాలీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరాన్ని పవన్‌కల్యాణ్‌ తన ప్రసంగంలో వివరించారు.

తెదేపా టీషర్టులు, జనసేన జెండాలతో కళాకారుల ప్రదర్శన         

బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్‌, రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌లను గెలిపించాలని కోరుతున్న పవన్‌

రేపల్లెలో నిర్వహించిన రోడ్‌షోలో పార్టీ జెండాల రెపరెపలు

ఈనాడు, బాపట్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని