మా ఆస్తులపై.. నీ పెత్తనం ఏంటీ జగన్!
ప్రస్తుతం రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చర్చ తీవ్రమవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సామాన్యులు ఆందోళన
మేల్కొనకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీలకు తీవ్ర నష్టం
ఈనాడు-బాపట్ల, న్యూస్టుడే - చీరాల
ప్రస్తుతం రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చర్చ తీవ్రమవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టంలో అనేక అంశాలు ప్రజాశ్రేయస్సుకు వ్యతిరేకంగా ఉండడంతోపాటు భవిష్యత్తులో అనేక సమస్యలకు మూలకారణాలవుతాయన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది. ప్రజల్లో విస్తృతమైన చర్చ పెట్టి ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చట్టాలను రూపొందించకుండా హడావుడిగా చేస్తే ఇలాంటి విపరిణామాలు ఎదురవుతాయని మేధావులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు శాపంగా మారింది. వీరందరూ సాగు చేస్తున్న భూములకు చాలామంది వద్ద హక్కు పత్రాలు ఉండవు. వీరంతా వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. వీరు హక్కుపత్రాలు చూపి నిర్ధారించుకోవాల్సి ఉన్నందున వారికి అన్యాయం జరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములపై ఎవరైనా అభ్యంతరం తెలిపితే వాటిని వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. వివాదం పరిష్కారమయ్యేంత వరకు సదరు భూమి తనఖా పెట్టడం, బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం కూడా సాధ్యం కాదు. ఇది పేదవర్గాలకు చాలా ఇబ్బందికరమైన అంశం. అంతేకాకుండా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత హక్కుదారులు వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి నిర్ణీత సమయంలో తెలియజేయకపోతే బాధ్యులైనవారికి ఆరు నెలల వరకు జైలుశిక్ష వేయడం అసంబద్ధమైన నిర్ణయమని నిపుణులు వాపోతున్నారు.
మూడు నెలలుగా ఆందోళన చేసినా..
ఈ చట్టానికి వ్యతిరేకంగా మూడు నెలలకుపైగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేసినా ప్రభుత్వం దిగిరాలేదు. ప్రజలకు కూడా అవగాహన లేక ఇది న్యాయవాదులకు సంబంధించిన అంశమని మిన్నకుండిపోయారు. అయితే ఈ చట్టం విధివిధానాలను అధ్యయనం చేసిన విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, మేధావులు చర్చావేదికలు నిర్వహించడం, ప్రతిపక్ష పార్టీలు చట్టం వల్ల కలిగే నష్టాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో అందరూ అప్రమత్తమయ్యారు. చట్టాన్ని తెలుగులోకి అనువాదం చేసి విస్తృత ప్రచారంలోకి తీసుకురావడంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు, సాగుదారులు 80 శాతం మంది ఉన్నారు. చిన్న కమతాలకు సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడితే వాటిని పరిష్కరించుకోవడానికి స్థానిక సివిల్ కోర్డులకు వెళ్లే వెసులుబాటు లేదు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి(టీఆర్వో), ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ అధికారులు(ఎల్టీఏవో) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు హైకోర్టు స్థాయిలో అధికారుల ఆదేశాలను సవాల్ చేయడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న వారిని వెంటాడుతోంది. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూములు, ఆస్తులు, దుకాణాలు ఇలా ఎలాంటి స్థిరాస్తులైనా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి పరిధిలోనే ఉంటాయి. టీఆర్వో, ఎల్టీఏవోలను రాష్ట్ర స్థాయిలో అథారిటీ నియమిస్తుండడం, ఇందుకు ఎలాంటి విధానాలు అనుసరిస్తారో స్పష్టత లేకపోవడంతో న్యాయవర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
చట్టాన్ని రద్దు చేసే వారికే మా మద్దతు
వైకాపా ప్రభుత్వం పూర్తి దురుద్దేశపూరితంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. చట్టం తెచ్చే ముందు రైతులు, ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదు. కొత్త చట్టం వల్ల మా లాంటి రైతుల భూములకు రక్షణ ఉండదు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు భూముల యజమానులను బెదిరింపులకు గురి చేయడానికి, వేధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదంపై స్థానిక సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా చేశారు. హైకోర్టుకు మా లాంటి చిన్న రైతులు వెళ్లగలరా. ఎన్నో ఏళ్లుగా మా ఆస్తులకు సంబంధించి భద్రపరుచుకున్న దస్తావేజులకు విలువ లేకుండా చేయటం ఏమిటి. చట్టాన్ని రద్దు చేసే వారికే ఎన్నికల్లో మద్దతు ఇస్తాం.
సీహెచ్ సుబ్బారావు, రైతు, బాపట్ల
ప్రజల హక్కులను కాలరాయడమే
భూహక్కు చట్టంలో టైటిల్ డీడ్పై అభ్యంతరాలు ఉంటే వాటిని న్యాయస్థానంలో కాకుండా ట్రిబ్యునల్ను ఆశ్రయించాలి. ఇదే అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇక్కడ ఉండే అధికార్లు అధికార పార్టీ చేతిలో ఉంటారు. ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది. గతంలో ఏ సమస్య వచ్చిన న్యాయస్థానాలను ఆశ్రయించేవారు. అక్కడ బాధితులకు న్యాయం జరిగేది. ఇపుడు న్యాయస్థానం ప్రమేయం లేకపోవడం దారుణం. ఇది ప్రజల హక్కులను కాలరాయటమే.
కొండయ్య, న్యాయవాది, చీరాల
ఎవరు బాధ్యత వహిస్తారు..?
ఎంతో కష్టపడి ఆస్తులు కొనుగోలు చేస్తాం. అటువంటి భూమికి సంబంధించి అసలైన పత్రాలు ఇవ్వకుండా జిరాక్సులే ఇవ్వటం దారుణం. ఒరిజినల్ పత్రాలు లేకపోవడం అభ్యంతరకరం. దీన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తి పేరు మార్చుకుంటే ఎవరిది బాధ్యత. టైటిల్ డీడ్పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ అధికారులే పరిష్కరించటం పేదలకు నష్టం చేస్తుంది.
పరుచూరి శ్రీనివాసరావు, చీరాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
[ 18-05-2024]
పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. -
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
[ 18-05-2024]
జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ కుమార్ తెలిపారు. -
సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపొద్దు: ఈసీ
[ 18-05-2024]
ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. -
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ
[ 18-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?
[ 18-05-2024]
కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. -
వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. -
డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
వాడరేవులో రాష్ట్ర గవర్నర్
[ 18-05-2024]
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. -
తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు
[ 18-05-2024]
ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్, ఎన్ఎస్ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. -
దయచేసి వినండి.. ధరలు అధికం
[ 18-05-2024]
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. -
ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి
[ 18-05-2024]
రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. -
పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం
[ 18-05-2024]
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. -
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి
[ 18-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. -
పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
[ 18-05-2024]
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. -
ఈవీఎంల భద్రతపై సమావేశం
[ 18-05-2024]
జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిపై వేటు పడుతుందో..
[ 18-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. -
కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
[ 18-05-2024]
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.10 లక్షల బురిడీ
[ 18-05-2024]
మాయ మాటలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. -
ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
[ 18-05-2024]
-
సినీ థియేటర్లను బతికించండి
[ 18-05-2024]
నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం