అరాచక నేతలను ఓటుతో తరిమికొట్టండి
‘ఇది మహనీయుల గడ్డ. ఎన్జీరంగా పుట్టిన ఈ నేలకు నమస్కరిస్తున్నా. చేనేత పితామహుడు ప్రగడకోటయ్య పుట్టిన ప్రదేశమిది.
మహనీయులు పుట్టిన నేలకు నమస్కరిస్తున్నా
పొన్నూరు సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఈనాడు, అమరావతి - న్యూస్టుడే, పొన్నూరు
జనసేనాని పవన్ కల్యాణ్ అభివాదం
‘ఇది మహనీయుల గడ్డ. ఎన్జీరంగా పుట్టిన ఈ నేలకు నమస్కరిస్తున్నా. చేనేత పితామహుడు ప్రగడకోటయ్య పుట్టిన ప్రదేశమిది. ఇంతటి ఉద్ధండుల గడ్డలో కేంద్ర మాజీ మంత్రి అల్లుడు రోశయ్య ఎమ్మెల్యేగా ఉండి ఐదేళ్లలో ఎర్రమట్టి మాటున రూ.2వేల కోట్లు దోచేశారు. తిరిగి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ డ్యాన్సుల మంత్రి సోదరుడు అంబటి మురళీ ఈసారి పోటీ చేస్తున్నారు. కులాలను రెచ్చగొడుతున్న ఆయనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని’ జనసేన అధినేత పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు. వీరి గురించి ప్రస్తావించినప్పుడు కూటమి కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది. ‘వైకాపా ప్రభుత్వం పొన్నూరును అభివృద్ధి చేయకపోగా పాడి రైతులకు అండగా ఉండి వారి ఉత్పత్తులను సంగం డెయిరీ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్న ధూళిపాళ్ల నరేంద్రపై ఈ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బంది పెట్టింది. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వ అరాచకాలను చూస్తూ ఉండబోం. కచ్చితంగా అధికారంలోకి రాగానే ఎవరైతే అరాచకంగా ప్రవర్తించారో వారి మక్కెలు విరగ్గొడతామని’ జనసేనాని హెచ్చరించారు.
సభలో పవన్కల్యాణ్ పక్కనే పెమ్మసాని, ధూళిపాళ్ల, అంబటి రాయుడు
ఒక్క అవకాశమిస్తే భ్రష్టుపట్టించారు..
‘వైకాపా నాయకులకు నన్ను తిట్టడం, బూతులు మాట్లాడటం.. సహజ సంపదను దోచుకోవడం తప్ప వారికి పాలన చేతకాదు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. ఒక్క పొన్నూరులోనే 12 ఎత్తిపోతల పథకాలను పక్కన పెట్టేసింది. దేవాలయ భూములను కొల్లగొట్టాలని చూశారు. చేబ్రోలులో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు చేశారని’ ఆయన ధ్వజమెత్తారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ‘ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడును జనసేనలో ప్రోత్సహిస్తాం. ఆయనకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తామని’ స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామికి పూజలు చేయడానికి తమలపాకులతో వచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు.
మహిళలు, యువతుల నినాదాలు
పోటెత్తిన జనకెరటం
పొన్నూరు సభకు హాజరైన జన సందోహం..
మండుటెండను సైతం లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు.. జనసైనికులు.. కమలనాథులు తరలిరావడంతో ఆదివారం పొన్నూరు పోటెత్తింది. కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారసభ తెలుగు తముళ్లు, జనసైనికులతో హోరెత్తింది. సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. హెలీప్యాడ్ నుంచి ఐలాండ్ సెంటర్ వరకు రోడ్షో నిర్వహించగా అడుగడుగునా పవన్కల్యాణ్కు అపూర్వ స్వాగతం లభించింది. పెద్దఎత్తున మహిళలు తరలివచ్చారు. రోడ్షోలో దారి పొడవునా పూలుచల్లి స్వాగతించారు. నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా పవన్ కల్యాణ్ సభకు హాజరైనా ఎండను సైతం లెక్క చేయకుండా ఓపిగ్గా నిలబడి సభకు హాజరయ్యారు. పెద్దఎత్తున యువత, మహిళలు తరలిరావడంతో సభ విజయవంతమైంది. సభ ముగిసే వరకు జన సైనికులు నినాదాలతో హోరెత్తించారు.
అభిమానమే వెన్నుదన్ను
నిజాయతీకి సంతకం పవన్
పెమ్మసాని చంద్రశేఖర్, కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి
మనిషి కష్టంలో ఉన్నప్పుడు చేయి అందించడం, భుజం తట్టడం ఆత్మబంధువు మాత్రమే చేయగలరు. అలాంటి ఆత్మ బంధువు, నీతి, నిజాయతీకి ఒక సంతకం నా అభిమాన నాయకుడు పవన్. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజలను మోసం చేశారు. ఐదేళ్ల పాలనలో పోలవరం.. రాజధాని.. ఉద్యోగాలు లేవు. వైకాపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు నోరు తెరిస్తే కులాలు, మతాల గురించి మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
వైకాపా నేతలు పద్ధతి మార్చుకోవాలి
ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కూటమి పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి
జనసేన అధినేత ఓ మహాశక్తి. వైకాపా నేతలు దౌర్జన్యంతో పవన్ రాక కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను ధ్వంసం చేసి ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆయన పర్యటన విజయవంతమైంది. ఇప్పటికైనా వైకాపా నాయకులు వారి పద్ధతులు మార్చుకోవాలి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో పవన్ కల్యాణ్ సంఘీభావం తెలిపి వైకాపాను భూస్థాపితం చేస్తామని చెప్పి పోరాటం చేస్తున్నారు.
విజయంలో భాగస్వాములు కావాలి
అంబటి రాయుడు, మాజీ క్రికెటర్
జనసేన అధినేత పవన్ నాయకత్వంలో అందరూ ముందుకు సాగాలి. ఎన్నికల్లో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే జనసేన అధినేత పవన్కు వేసినట్లుగా భావించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
[ 18-05-2024]
జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ కుమార్ తెలిపారు. -
సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపొద్దు: ఈసీ
[ 18-05-2024]
ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. -
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ
[ 18-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?
[ 18-05-2024]
కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. -
వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. -
డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
వాడరేవులో రాష్ట్ర గవర్నర్
[ 18-05-2024]
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. -
తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు
[ 18-05-2024]
ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్, ఎన్ఎస్ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. -
దయచేసి వినండి.. ధరలు అధికం
[ 18-05-2024]
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. -
ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి
[ 18-05-2024]
రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. -
పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం
[ 18-05-2024]
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. -
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి
[ 18-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. -
పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
[ 18-05-2024]
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. -
ఈవీఎంల భద్రతపై సమావేశం
[ 18-05-2024]
జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిపై వేటు పడుతుందో..
[ 18-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. -
కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
[ 18-05-2024]
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.10 లక్షల బురిడీ
[ 18-05-2024]
మాయ మాటలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. -
ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
[ 18-05-2024]
-
సినీ థియేటర్లను బతికించండి
[ 18-05-2024]
నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా