నోటికాడ ‘అన్నం’ లాగేసిన జగన్
పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు.
అన్న క్యాంటీన్ల మూతతో అర్ధాకలితో నిరుపేదలు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్టుడే, బృందం
పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు. అధికారంలోకి వచ్చాక తన వికృత ఆలోచనలకు పదునుపెట్టాడు.రూ.5కే అన్నక్యాంటీన్లో అందుబాటులో ఉండే భోజనాన్ని నిరుపేదలకు అందకుండా చేశాడు.
రిక్షా కార్మికులు, ఆటోవాలాలు, భవన నిర్మాణ కూలీలు, గ్రామాల నుంచి పనులపై వచ్చేవారు.. ఇలా ఎందరో 2019కు ముందు అన్నక్యాంటీన్లలో రూ.5కే ఆకలి తీర్చుకునే వారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆకలి తీరే అవకాశం దూరం చేశారు. అధిక ధరకు బయట భోజనం చేయకలేక ఇబ్బందులుపడ్డారు.
500 మంది భోజనం చేసేవారు..
పల్నాడు జిల్లాలో తెదేపా ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో 10 చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. వాటిని శాశ్వత ప్రాతిపదికన నిర్వహించాలన్న సదుద్దేశంతో శాశ్వత భవనాలు కూడా నిర్మించారు. అందుకు ఒక్కో భవనం, అందులో ఫర్నిఛర్కు కలిపి రూ.40 లక్షల వ్యయం చేసింది. మొత్తం రూ.4 కోట్లతో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపి రూ.15కు అందించారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్న లక్ష్యంతో వండి వడ్డించే బాధ్యతను ఇస్కాన్ సంస్థలకు అప్పగించారు. నరసరావుపేటలో 3, చిలకలూరిపేటలో 3, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండలో ఒక్కోటి చొప్పున క్యాంటీన్లు పని చేశాయి. రోజుకు ప్రతి క్యాంటీన్లో 500 మంది వరకు భోజనం చేసేవారు. ఇది 2019 ఎన్నికల వరకూ సాగింది.
తెదేపా నేతలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి..
జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తెదేపా నేతలే సేవాభావంతో క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు నిత్యం మధ్యాహ్న భోజనం అందించారు. రోజూ వందల మందికి ఉచితంగా అన్నం పెట్టారు. కూలి పనులు చేసుకునే వారికి ఎంతో ఉపశమనం కలిగించింది. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ వచ్చేవరకూ అన్న క్యాంటీన్లు నడిచాయి. కోడ్ రీత్యా ప్రస్తుతం నిలిపేయాల్సి వచ్చింది.
తెదేపాపై కక్షతో పథకానికి స్వస్తి
వైకాపా పాలనలో..: వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్లోని నిజస్వరూపం బయటపడింది. తెదేపా వ్యవస్థాపకుడి పేరుతో అన్న క్యాంటీన్లను మూసేశారు. మెరుగైన మెనూతో వైఎస్సార్ క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రజాప్రతినిధులు ఊదరగొట్టారు. తర్వాత క్యాంటీన్ల జాడేలేదు. నరసరావుపేటలో వైకాపా నేతలు అత్యుత్సాహంతో అన్న క్యాంటీన్లకు రంగులు మార్చి వైఎస్సార్ క్యాంటీన్ అని బోర్డులు కూడా మార్చారు. మార్కెట్ కూడలిలో ఉన్న క్యాంటీన్కు వేసిన రంగులు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. స్టేడియం వద్ద ఉన్న క్యాంటీన్ భవన ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరిగాయి.
చిలకలూరిపేటలో ఎన్ఆర్టీ సెంటర్, పురుషోత్తమపట్నం రోడ్డు, గడియారం స్తంభం కూడళ్లలో క్యాంటీన్ భవనాలు నిరుపయోగంగా మారాయి. వినుకొండ బస్టాండ్ సెంటర్లో క్యాంటీన్ను అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్లలో ఉన్న క్యాంటీన్లు నిరుపయోగంగా మారాయి.
ససత్తెనపల్లిలో.. : కార్మికులు, కర్షకులు, శ్రామికులు, అన్నార్తుల ఆకలి తీర్చేందుకు తెదేపా ప్రభుత్వం సుమారు రూ.40 లక్షలు వెచ్చించి సత్తెనపల్లి పట్టణంలోని తాలుకా సెంటర్లో అన్న క్యాంటీన్ భవనం నిర్మించింది. రోజులో 1500 మందికి భోజనం వడ్డించారు. శ్రామికులు, కార్మికులతో క్యాంటీన్ కళకళలాడేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాంటీన్ మూసేసి అన్నార్తుల నోటికాడ కూడు తీసేసింది.
వైకాపాకు పుట్టగతులుండవు
- వెంకటేశ్వర్లు, నరసరావుపేట
అన్నం పెట్టే క్యాంటీన్లు మూసేసిన వైకాపాకు రానున్న రోజుల్లో పుట్టగతులుండవు. ఆటోవాలాలు, కూలీ పనులకు వచ్చిన వారు, అనారోగ్యంతో ఆసుపత్రులకు వచ్చిన రోగి బంధువులు ఇలా అనేక మంది పట్టణానికి వచ్చి రూ.100 పెట్టి అన్నం తినలేని వారు అన్నక్యాంటీన్లలో రూ.5 చెల్లించి కడుపునిండా తిన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు మూసి పెద్ద తప్పు చేసింది. పేదలపై పగ ఎందుకో అర్థం కాలేదు. వైకాపా నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పేదల ఆకలితీర్చితే మంచిది.
దుర్మార్గంగా మూసేశారు
-శివారెడ్డి, మానుకొండవారిపాలెం
వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అధికారంలోకి రాగానే దుర్మార్గంగా మూసేసింది. పేదల పొట్ట కొట్టారు అన్న దానికి అన్న క్యాంటీన్ల మూసివేత నిదర్శనం. పనుల మీద పట్టణానికి వచ్చి మధ్యాహ్నం రూ.5కే నాణ్యమైన భోజనం తినేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు.
ముద్ద తీసేశారు
-సీహెచ్ సుబ్బారావు, వినుకొండ
అన్న క్యాంటీన్లలో మధ్యాహ్నం భోజనం 300 నుంచి 400 మంది తినేవారు. అక్షయపాత్ర వారు వేడిగా అన్నం తెచ్చి పెట్టారు. రాత్రి 8.30 గంటలకే భోజనం అయిపోయేది. ఆహారం చాలా శుభ్రంగా ఉంది. పేదలకు చాలా మేలు జరిగింది. ఇది మూసివేయడం ఒకరకంగా నోటికాడ ముద్ద తీసినట్లే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు