పట్టు సాధించు... ఉపాధి చేపట్టు..!
‘మంచి ఉద్యోగంలో చేరాలి.. జీవితంలో తొందరగా స్థిరపడాలి..’ ఇదే నేటి యువత లక్ష్యం. దీన్ని చేరుకోవాలంటే ఉన్నత చదువులు కూడా ఉండాలి. అదే సమయంలో ఉద్యోగ సాధనలో వెనుకబడకూడదు. జీవనోపాధి కోసం ప్రభుత్వ ఉద్యోగమే కావాలంటే కుదరదు.
ఆంగ్లం, కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన
ఈడబ్ల్యూఆర్సీ ఆధ్వర్యంలో శిక్షణ
గ్రామీణ యువతకు అవకాశం
తరగతుల నిర్వహణ
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: ‘మంచి ఉద్యోగంలో చేరాలి.. జీవితంలో తొందరగా స్థిరపడాలి..’ ఇదే నేటి యువత లక్ష్యం. దీన్ని చేరుకోవాలంటే ఉన్నత చదువులు కూడా ఉండాలి. అదే సమయంలో ఉద్యోగ సాధనలో వెనుకబడకూడదు. జీవనోపాధి కోసం ప్రభుత్వ ఉద్యోగమే కావాలంటే కుదరదు. ప్రైవేటులో లేదా స్వయం ఉపాధి రంగాన్నయినా ఎంచుకోవాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యానికే ప్రాధాన్యం. ఉద్యోగం దక్కించుకోవాలంటే నైపుణ్యాభివృద్ధికి శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో ఉపాధికి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ విషయంలో పట్టణ, నగర యువత ఒకడుగు ముందుంటున్నా గ్రామీణ యువత దగ్గరకు వచ్చే సరికే అసలు సమస్య ఎదురవుతోంది. అటు ఇంగ్లిష్పై పట్టు లేకపోవడం, కంప్యూటర్, ఇతర సాంకేతిక విభాగాల్లో తగిన నైపుణ్యం పొందక పోవడం వంటి కారణాలతో ఉద్యోగ సాధనలో వెనుకబడి పోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
పాత డీఆర్డీఏ కార్యాలయంలో...
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ద్వారా సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ‘ఇంగ్లిష్ వర్క్ రెడీనెస్ అండ్ కంప్యూటర్ శిక్షణ (ఈడబ్ల్యూఆర్సీ) కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత శిక్షణ పొందేందుకు అర్హులు. పదో తరగతి విద్యార్హత ఉండాలి. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తారిక్కడ. వయస్సు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
కంప్యూటర్ శిక్షణలో..
ఇప్పుడు తప్పనిసరి అయ్యాయి
ఆంగ్లంపై పట్టు...కంప్యూటర్ పరిజ్ఞానం.. ఇవి రెండూ ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా తప్పనిసరి. వీటిలో నైపుణ్యం ఉన్న వారికి ఉపాధికి ఇబ్బంది లేదు. ఈడబ్ల్యూఆర్సీలో ఇదే చేస్తున్నారు. ఈ కేంద్రంలో చేరిన అభ్యర్థులకు ఆంగ్లంపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నారు. ఆంగ్లంలో మాట్లాడటం, రాయడంలో మెలకువల్ని నేర్పిస్తున్నారు. పరీక్షలు సైతం నిర్వహిస్తూ వారిని ప్రతిభాన్వితులుగా తీర్చిదిద్దుతున్నారు. కంప్యూటర్ వినియోగంపై కూడా శిక్షణ ఇస్తున్నారు. పరిశ్రమలు, సంస్థల అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్లో వివరాల నమోదు, గణాంకాలు ఎలా అన్న అంశాలను వివరిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు సైతం కల్పిస్తున్నారు.
బాలికల వసతి.. ఇక్కడే ప్రత్యేకం
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈడబ్ల్యూఆర్సీ శిక్షణ కేంద్రాలు ఉన్నా ఎక్కడా బాలికలకు సరైన వసతి సదుపాయాలు లేవు. సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో బాలికల వసతికి అవసరమైన సదుపాయాలన్నీ ఉండటం విశేషం. దీంతో ఇక్కడ చేరేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు వికారాబాద్కు చెందిన వారు సైతం ఆసక్తి చూపుతున్నారు. శిక్షణకు ఎంపికైన వారికి వసతితోపాటు దుస్తులు, విద్యా సామగ్రి, భోజనం తదితరాలు ఉచితంగానే అందిస్తున్నారు.
నైపుణ్య పెంపుదలకు ప్రాధాన్యం : శ్రీనివాస్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సంగారెడ్డి
ఈడబ్ల్యూఆర్సీలో శిక్షణకు ఎంపికైన వారికి నైపుణ్యాల మెరుగుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. కోర్సులో భాగంగా ఆంగ్లంపై పట్టు సాధించేలా చూస్తున్నాం. కంప్యూటర్పై పనిచేయడంలో కావాల్సిన మెలకువలపై నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఉపాధి హామీ పథకంలో 100 పనిదినాలు పూర్తిచేసుకున్న కుటుంబాలకు కూడా ఉన్నతి పేరుతో శిక్షణ ఇస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?