వ్యర్థానికి అర్థం..!
వ్యర్థానికి అర్థం చెబుతున్నాయి నగరంలోని కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు. రోజూ ఉత్పత్తి అవుతున్న తడి వ్యర్థాలను కంపోస్ట్గా మార్చి పునర్వినియోగంపై దృష్టి పెడితే, మరికొన్ని ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ల ద్వారా ఎరువుగా
గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో కంపోస్ట్ తయారీ
రైతులకు ఉచితంగా పంపిణీ
కంపోస్టు డబ్బా
ఈనాడు, హైదరాబాద్: వ్యర్థానికి అర్థం చెబుతున్నాయి నగరంలోని కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు. రోజూ ఉత్పత్తి అవుతున్న తడి వ్యర్థాలను కంపోస్ట్గా మార్చి పునర్వినియోగంపై దృష్టి పెడితే, మరికొన్ని ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ల ద్వారా ఎరువుగా మార్చి వినియోగించడంతో పాటు రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. సగటున 500 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతంలో రోజూ 400 కేజీల తడి చెత్త ఉత్పత్తి అవుతుంది. వీటిని సేకరించడం, విడదీయడం, ఎరువుగా మార్చే ప్రక్రియను చేపడుతున్నారు. సైబరాబాద్ పరిధిలోని అపర్ణ సైబర్ లైఫ్, అపర్ణ సైబర్ కమ్యూన్, మైహోమ్ జ్యువెల్, నాగార్జున రెసిడెన్సీ, ఎన్సీసీ అర్బన్ గార్డెనియా వంటి సొసైటీల్లో ఈ పద్ధతులను అవలంబిస్తున్నారు. మొత్తం 80 గేటెడ్ కమ్యూనిటీలు, హౌజింగ్ సొసైటీలతో కలిసి వ్యర్థాల రీసైక్లింగ్పై పని చేస్తున్నాయి. గచ్చిబౌలిలో నాగార్జున రెసిడెన్సీలో మొత్తం 400 ఫ్లాట్స్ ఉండగా రోజూ 450కేజీల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ వ్యర్థాల సేకరణకు ఆకుపచ్చ రంగు, నీలం రంగు, ఎరుపు రంగుల డబ్బాలను కమ్యూనిటీలోని వారందరికీ పంచుతారు. ఆకుపచ్చ డబ్బాల్లో వంటగది వ్యర్థాలు, వండిన ఆహారం, మిగిలిన ఆహారం, కోడిగుడ్ల పొట్టు, పాడైన కూరగాయలు, పండ్లు, టీ బ్యాగ్లు, ఎండిపోయిన ఆకులు, పువ్వులు సేకరిస్తే. నీలం రంగు డబ్బాలో డ్రైవేస్ట్...కాగితాలు, మెటల్ క్యాన్లు, గ్లాస్, రబ్బర్, థర్మకోల్, వెంట్రుకలు, చెక్కపొట్టు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ఎరుపు రంగు డబ్బాలో శానిటరీ వ్యర్థాలు, నాప్కిన్లు, బ్యాండేజీలు, టిష్యూలు, రేజర్ బ్లేడ్లు, సిరంజీలు, ఇంజెక్షన్ వయల్స్, నిర్మాణ వ్యర్థాలు, పగిలిన అద్దాలు సేకరిస్తారు. ఇతర అపార్ట్మెంట్లు, కమ్యూనిటీల్లోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు.
పక్కాగా నిబంధనల అమలు
-హరిప్రసాద్, నాగార్జున రెసిడెన్సీ, గచ్చిబౌలి
కొందరు యంత్రాల ద్వారా కంపోస్ట్ను తయారు చేస్తున్నారు. మేము నాలుగేళ్లుగా సహజ పద్ధతినే అవలంబిస్తున్నాము. ఫ్లాట్లలో వ్యర్థాల సేకరణకు సంబంధించి పనివాళ్లకు శిక్షణ ఇచ్చాము. మూడు నెలలకోసారి అద్దె ఇళ్లలో ఉండేవారు ఖాళీ చేయడం కొత్తవారు రావడం పరిపాటి. వారికి దీనిపై అవగాహన కల్పిస్తాము. కొత్త బిన్లను అందిస్తాము. మధ్యాహ్నం 1గంటకు చెత్త మొత్తం సెల్లార్లో ఉన్న సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కు వస్తుంది. అక్కడి ష్రెడర్ మెషీన్లో తడి వ్యర్థాలను పంపి ముక్కలుగా చేసి వాటిని మళ్లీ 40 ట్రేలలో ఉంచుతాము. వాటిని మరో బిన్లోని లేయర్లుగా నింపుతాము. వాసన రాకుండా ఉండేందుకు కొబ్బరిపీచు పొడి, ఆకులు, ఉంచుతాము. అవి తడినంతటినీ లాగేస్తాయి. 40 రోజులపాటు 70డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఉంచి పరిశీలిస్తుంటాము. అనంతరం ఆ బిన్ను ఖాళీ చేసి రెండు రోజులు ఎండబెడితే కంపోస్ట్ ఎరువు తయారైపోతుంది. దానిని కమ్యూనిటీలోని గార్డెన్లో వినియోగించి.. మిగిలింది ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను వెండార్లకు విక్రయిస్తుంటాము.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?