TS Highcourt: మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించాలన్న తెలంగాణమంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి
హైదరాబాద్: ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించాలన్న తెలంగాణమంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో తెరాస తరఫున కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. ఈవీఎంల వీవీ ప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలుపొందినట్టు ప్రకటించారని, అది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని 2019లో అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ పిటిషన్ తిరస్కరించాలని, పిటిషన్లో సరైన కారణాలు చూపలేదని కొప్పుల ఈశ్వర్ కోరారు. ఇరు వైపులా వాదనలు విన్న హైకోర్టు... కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. లక్ష్మణ్ పిటిషన్పై త్వరలో హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.