Covid update: కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. తెలంగాణలో కొత్తగా 459 కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 26,126 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 459 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి ఇవాళ

Published : 28 Jun 2022 20:33 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 26,126 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 459 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి ఇవాళ 247 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,172 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌లో 232, రంగారెడ్డిలో 60, సంగారెడ్డిలో 54, మేడ్చ్‌ మల్కాజ్‌గిరి 28, ములుగు 16, భద్రాద్రి కొత్తగూడెంలో 9 కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని