logo

‘అగ్నిపథ్‌లో మార్పులు అవసరం’

దేశ భద్రత కోసం అనుక్షణం తపించే సుశిక్షుతులైన త్రివిధ దళాల సైనికులతో ఎవరూ రాజకీయం చేయలేరని మాజీ నౌకాదళ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారి అరుణ్‌ సత్యమూర్తి అన్నారు.

Published : 30 Jun 2022 02:28 IST


అరుణ్‌ సత్యమూర్తి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: దేశ భద్రత కోసం అనుక్షణం తపించే సుశిక్షుతులైన త్రివిధ దళాల సైనికులతో ఎవరూ రాజకీయం చేయలేరని మాజీ నౌకాదళ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారి అరుణ్‌ సత్యమూర్తి అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బుధవారం జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ఆధ్వర్యంలో సార్వత్రిక సామాజిక వేదికలో భాగంగా నిర్వహించిన ‘ఓపెన్‌ టాక్‌’లో ఆయన మాట్లాడారు. సైనికులకు పింఛను ఇవ్వడం అనేది ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదని, అది ఉద్యోగుల హక్కు అని వివరించారు. విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్రాల విభాగాల డీన్‌, సార్వత్రిక సామాజిక వేదిక రూపకర్త ఆచార్య ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఏవీఎన్‌.రెడ్డి, ఆచార్యులు సత్తిరెడ్డి, ఏవీపీఆర్‌సీ డైరెక్టర్‌ ఆచార్య గుంటి రవీందర్‌, వేదిక నిర్వాహకులు డాక్టర్‌ కె.కృష్ణారెడ్డి, జర్నలిజం మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం అధ్యాపకులు యాదగిరి, సునీల్‌కుమార్‌, ఇతర విభాగాల డైరెక్టర్లు, డీన్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని