BJP: భాజపా పదాధికారుల సమావేశాలను ప్రారంభించిన నడ్డా
నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ, రేపు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ..
హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ, రేపు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పార్టీ పదాధికారుల సమావేశాన్ని ఈ ఉదయం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు భేటీలో పాల్గొంటారు. మొత్తంగా 352 మంది ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొననున్నారు. దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కార్యవర్గ భేటీలో చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలు భేటీలో చర్చకు రానున్నాయి. భాజపా రాజకీయ తీర్మానాలు, మోదీ 8 ఏళ్ల పాలనాంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాష్ట్రంలో తెరాస పాలనకు తెరదించడం, భాజపాను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడంపై కార్యవర్గ సమావేశంలో చర్చించేందుకు అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.