BJP: భాజపా పదాధికారుల సమావేశాలను ప్రారంభించిన నడ్డా

నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ, రేపు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ..

Updated : 02 Jul 2022 12:32 IST

హైదరాబాద్‌: నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ, రేపు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పార్టీ పదాధికారుల సమావేశాన్ని ఈ ఉదయం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు భేటీలో పాల్గొంటారు. మొత్తంగా 352 మంది ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొననున్నారు. దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కార్యవర్గ భేటీలో చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత  నిర్మాణం వంటి కీలక అంశాలు భేటీలో చర్చకు రానున్నాయి. భాజపా రాజకీయ తీర్మానాలు, మోదీ 8 ఏళ్ల పాలనాంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాష్ట్రంలో తెరాస పాలనకు తెరదించడం, భాజపాను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడంపై కార్యవర్గ సమావేశంలో చర్చించేందుకు అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని