Telangana News: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌

రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. యశ్వంత్ సిన్హాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు...

Updated : 02 Jul 2022 13:39 IST

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. యశ్వంత్ సిన్హాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బేగంపేట నుంచి జలవిహార్‌ వరకు తెరాస భారీ ర్యాలీగా బయలుదేరింది. బేగంపేట, రాజ్‌భవన్‌, ఖైరతాబాద్‌ మీదుగా జలవిహార్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం యశ్వంత్‌ సిన్హాకు జలవిహార్‌లో తెరాస సభ ఏర్పాటు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని