logo

మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభం 17న

మేడ్చల్‌-మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)ను శామీర్‌పేట అంతాయిపల్లి వద్ద ఈనెల 17న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 11 Aug 2022 03:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)ను శామీర్‌పేట అంతాయిపల్లి వద్ద ఈనెల 17న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై కీసరలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హరీశ్‌తో కలిసి మంత్రి మల్లారెడ్డి బుధవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ రోజు జిల్లాలో భారీ మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన వసతులు కల్పించడంతో పాటు విద్యుత్తు అలంకరణ చేయాలన్నారు. మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ అంతాయిపల్లిలో పర్యటించి నూతన భవనాలను పరిశీలించారు. పెండింగు పనులను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని డీఎఫ్‌వో అశోక్‌కుమార్‌ను, ఆవరణను శుభ్రం చేయించాలని డీపీవో రమణమూర్తిని ఆదేశించారు. బాలానగర్‌ డీసీపీ సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని