logo

బాల్కనీ నుంచి కిందపడి మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ అపార్టుమెంట్‌ మూడో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లాకు చెందిన బి.ఈశ్వరరావు తన భార్య సత్యవతి(42)తో...

Published : 11 Aug 2022 03:22 IST


సత్యవతి

గచ్చిబౌలి: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ అపార్టుమెంట్‌ మూడో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లాకు చెందిన బి.ఈశ్వరరావు తన భార్య సత్యవతి(42)తో కలిసి కొంతకాలం కిందట నగరానికి వచ్చాడు. నానక్‌రాంగూడలో అద్దెకు ఉంటున్న వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. సత్యవతి సమీపంలోని ఇళ్లలో పని మనిషిగా చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం సాయి సిగ్నేచర్‌ అపార్టుమెంట్‌ మూడో అంతస్తులో ఉంటున్న జగదీశ్వర్‌ ఇంట్లో పని చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో వృద్ధురాలైన జగదీశ్వర్‌ తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. బాల్కనీలో ఫ్లోర్‌ శుభ్రం చేస్తూ సత్యవతి కిందపడింది. ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదవశాత్తు పడిందా? ఆత్మహత్య చేసుకుందా అని పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని