Raghunandan: ఏ చట్టం ప్రకారం మంత్రి కాల్పులు జరిపారు?: రఘునందన్
మంత్రి శ్రీనివాస్గౌడ్ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు డిమాండ్ చేశారు. ఏ చట్టం ప్రకారం మహబూబ్నగర్లో మంత్రి కాల్పులు జరిపారని నిలదీశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ మాట్లాడారు.
పర్సనల్ సెక్యూరిటీ నుంచి తుపాకీ తీసి కాల్చడమేంటని రఘునందన్ ప్రశ్నించారు. మంత్రికేమైనా గన్ లైసెన్స్ ఉందా? అని నిలదీశారు. ప్రాణహాని ఉందంటూ శ్రీనివాస్గౌడ్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించిందని.. అలాంటి వ్యక్తి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్వో) వద్దే రబ్బర్ బుల్లెట్లు ఉంటే ఎమ్మెల్యేలమంతా ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. తమకు భద్రతగా ఉన్న గన్మెన్ల వద్ద ఉన్నవి రబ్బర్ బుల్లెట్లా? ఒరిజినల్ బుల్లెట్లా? అని ప్రశ్నించారు. దీనిపై డీజీపీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘బహిరంగ ప్రదేశాల్లో తుపాకీ కాల్చడం చట్టరీత్యా నేరం. ఈ విషయంలో డీజీపీ మూడు తప్పులు చేశారు. ఎస్పీ సమక్షంలో తుపాకీ పేలిస్తే దాన్ని ఇప్పటి వరకు సీజ్ చేయలేదు. మంత్రిపై కేసు నమోదు చేసే అవకాశమున్నా పెట్టలేదు. ఆ తుపాకీని ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపలేదు. ఎస్పీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా? రిటైర్ అయ్యాక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి కోసం డీజీపీ ఆలోచిస్తున్నారా? దేనికోసం మౌనంగా ఉన్నారు?ఈ విషయంపై మాట్లాడేందుకు డీజీపీ కార్యాలయానికి ఎప్పుడు రమ్మంటారు? డీజీపీ నిజాయితీగా వ్యవహరించి తుపాకీని ఫొరెన్సిక్కు పంపాలి. లేనిపక్షంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం’’ అని రఘునందన్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’