logo

హారన్‌ కొట్టారని చితకబాదారు..

బర్త్‌డే వేడుకల్లో ఉన్న తమ జోష్‌కు బండి హారన్‌ కొట్టి ఆటంకం కల్పించారనే నెపంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దర్ని 20 మంది చితకబాదిన సంఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మన్సూరాబాద్‌కు చెందిన ఓ యువకుడి బర్త్‌డే పార్టీని

Published : 18 Aug 2022 03:44 IST

 ఇద్దరిపై 20 మంది దాడి

నాగోలు, న్యూస్‌టుడే: బర్త్‌డే వేడుకల్లో ఉన్న తమ జోష్‌కు బండి హారన్‌ కొట్టి ఆటంకం కల్పించారనే నెపంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దర్ని 20 మంది చితకబాదిన సంఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మన్సూరాబాద్‌కు చెందిన ఓ యువకుడి బర్త్‌డే పార్టీని ప్రధాన రోడ్డుపై ఉన్న తిరుమల వైన్స్‌ వద్ద మంగళవారం అర్ధరాత్రి నిర్వహించారు. అక్కడే తప్పతాగిన యువకులు కేకు కోసి సంబరాలు చేసుకొంటున్నారు. ఇంతలో ఓ బైక్‌పై అటుగా వచ్చిన శ్రీకాంత్‌, శివరాజ్‌ వీరిని పక్కకు తొలగాలని చెబుతూ హారన్‌ మోగించారు. దీంతో కోపోద్రిక్తులైన ఆ యువకులు వీరిపై దాడి చేశారు. ఇదేమని ప్రశ్నించినా వినకుండా చితకబాదారు. దీంతో బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు వైన్స్‌ వద్ద తచ్చాడుతున్న మహేష్‌, భరత్‌, ఆనంద్‌, క్రాంతిని అదుపులోకి తీసుకుని స్టేషనుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని