37 ఎకరాలు..1500 కోట్లు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు చెందిన గచ్చిబౌలిలో అత్యంత విలువైన భూమిని మరోసారి వేలం వేయబోతున్నారు
వేలానికి బీఎస్ఎన్ఎల్ స్థలం
గచ్చిబౌలిలోని భూమి
ఈనాడు, హైదరాబాద్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు చెందిన గచ్చిబౌలిలో అత్యంత విలువైన భూమిని మరోసారి వేలం వేయబోతున్నారు. ఈసారి 37 ఎకరాలను విక్రయించాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. తద్వారా రూ.1500 కోట్ల ఆదాయం రాబట్టుకోవచ్చనేది అంచనా.
బిడ్డర్ల కోరిక మేరకు..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న భూమి నగదీకరణ విధానాన్ని అనుసరించి దేశంలోని బీఎస్ఎన్ఎల్కు చెందిన భూములను విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం దేశవ్యాప్తంగా మొదటి దశలో ఆరు స్థిరాస్తులను గుర్తించారు. ఇందులో గచ్చిబౌలి ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూమిలో తొలుత 11 ఎకరాలను బిడ్డింగ్ ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. అప్పట్లో కనీస మొత్తం రూ.402 కోట్లుగా నిర్ణయించారు. వందకోట్ల నెట్వర్త్ ఉన్న బిడ్డర్లే పాల్గొనాలనే షరతులు పెట్టారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) ఆన్లైన్ పోర్టల్ ద్వారా బిడ్డర్లను ఆహ్వానించారు. స్పందన అంతగా రాలేదు. నియమ నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని బిడ్డర్లు కోరారు. 11 ఎకరాలు తక్కువ విస్తీర్ణం కావడంతో మరింత ఎక్కువ భూమి కావాలని సూచనలు వచ్చాయి. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న బీఎస్ఎన్ఎల్లోని ల్యాండ్ మానిటైజేషన్ కమిటీ 37 ఎకరాలను తదుపరి బిడ్డింగ్లో విక్రయించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ కె.వి.ఎన్.రావు వెల్లడించారు. హైదరాబాద్లో బీఎస్ఎన్ఎల్కు ఉన్న మిగతా భూములను దశలవారీగా విక్రయించే అవకాశం ఉంది.
పునరుజ్జీవం 2.0కి.. భూముల విక్రయం, లీజింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బీఎస్ఎన్ఎల్ పునరుజ్జీవం 2.0కి వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్తో సహా రాష్ట్రంలో నెట్వర్క్ విస్తరణపై ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన 4జీ నెట్వర్క్ను పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు 4జీ టవర్లను రాష్ట్రవ్యాప్తంగా 4100 ఏర్పాటు చేయబోతుంది. హైదరాబాద్లో కొత్తగా 532 టవర్లు రాబోతున్నాయి.
లీజుకు పలు భవనాలు..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో బీఎస్ఎన్ఎల్కు పెద్ద ఎత్తున స్థిరాస్తులు ఉన్నాయి. కార్యాలయాల భవనాలు, క్వార్టర్లు ఉన్నాయి. వీటిని లీజ్కు ఇవ్వాలని ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు లీజుకు తీసుకొన్నాయి. ఆదర్శ్నగర్లోని బీఎస్ఎన్ఎల్ భవనంలో నాలుగు అంతస్తులను ఆదాయపన్ను శాఖ లీజుకు తీసుకుంది. జీఎస్టీ విభాగం సైతం చర్చలు జరుపుతోంది. ప్రాథమికంగా సిటీలో 1.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల భవనాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. వీటిలో ఈ ఏడాది 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్