Revanth Reddy: కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే కొడంగల్కు ఆ పరిస్థితి: రేవంత్రెడ్డి
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్.. ఈ నాలుగేళ్లలో అక్కడ ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెరాస పాలనలో కొడంగల్ నియోజకవర్గానికి తుప్పు పట్టిందన్నారు.
కొడంగల్: వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్.. ఈ నాలుగేళ్లలో అక్కడ ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెరాస పాలనలో కొడంగల్ నియోజకవర్గానికి తుప్పు పట్టిందన్నారు. కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కొడంగల్లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ తెరాస వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
‘‘పాలమూరు-రంగారెడ్డి మినహా ఇతర ఏ ప్రాజెక్టుతోనూ తెరాసకు సంబంధం లేదు. అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి. 2019 జనవరి 1 నుంచి కొడంగల్కు అధికార పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చే వరకు ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. నిధులు ఇచ్చేవరకు దీక్ష కొనసాగించాలి. అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే గ్రామ గ్రామాన తిరిగి తెరాస పనితీరును ప్రజల ముందు పెడతాం. తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్లను ఎందుకు అరెస్టు చేయడం లేదు? కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే తెరాస, భాజపా కలిసి కుట్రలు చేస్తున్నాయ్’’ అని రేవంత్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.