Dharmapuri Srinivas: కాంగ్రెస్లో చేరింది నేను కాదు.. మా అబ్బాయి: డీఎస్
తాను కాంగ్రెస్లో చేరినట్లు వస్తున్న వార్తలను డీఎస్ ఖండించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ పంపించారు.
హైదరాబాద్: తాను కాంగ్రెస్లో చేరినట్లు వస్తున్న వార్తలను సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) (Dharmapuri Srinivas) ఖండించారు. తనను వివాదాల్లోకి లాగొద్దని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు (Kharge) లేఖ రాశారు. ‘‘ నిన్న నా కుమారుడు సంజయ్ కాంగ్రెస్లో చేరారు. సంజయ్తోపాటు నేను కూడా గాంధీ భవన్కు వెళ్లాను. నాకు కూడా కండువా కప్పి పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేశారు. ఒకవేళ నేను కాంగ్రెస్లో చేరినట్లు భావిస్తే రాజీనామా చేస్తాను’’ అని డీఎస్ పేర్కొన్నారు. వయసురీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు.
తన లేఖలో భార్య విజయలక్ష్మిని సాక్షిగా పేర్కొన్నారు. డీఎస్ గతంలోనే కాంగ్రెస్కు రాజీనామా చేశారని భార్య విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు చూపించారు. ‘‘ రాజకీయాల కోసం డీఎస్ను వాడుకోవద్దు. డీఎస్కు ఇప్పటికే ఒకసారి బ్రెయిన్స్ట్రోక్ వచ్చింది. కాంగ్రెస్ వారికి చేతలు జోడించి దండం పెడుతున్నా. కాంగ్రెస్ వారు ఇటువైపు రావొద్దు. డీఎస్ను కొంచెం ప్రశాంతంగా బతకనివ్వండి.’’ అని విజయలక్ష్మి అన్నారు. డీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాస (అప్పట్లో తెరాస)లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?