MP Laxman: కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయ్: ఎంపీ లక్ష్మణ్
ఎన్నికల ఏడాది కాబట్టే రైతుల మీద భారాస ప్రభుత్వం ఎనలేని ప్రేమ కనబరుస్తుందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. ఎన్ని కుయుక్తులు పన్నిన వచ్చే ఎన్నికల్లో భారాస ఓటమి తప్పదని ఆయన అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ విశ్వాసాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. శ్రీరామనవమికి రాముడికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఇవ్వలేని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని ఆయన విమర్శించారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ భాజపా పాలిత రాష్ట్రాల్లో రూ.20కి పైగా పన్ను తగ్గిస్తే.. తెలంగాణలో కనీసం రూ.5 తగ్గించడానికి కేసీఆర్ సర్కార్కు మనసు రావట్లేదని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే దళితులపై కేసీఆర్, కేటీఆర్కు ప్రేమ పుట్టుకొస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఊసరవెల్లి రంగు మార్చినట్లు కేసీఆర్ తెరాస నుంచి భారాసగా మార్చారని.. ఎన్ని కుయుక్తులు పన్నిన ఆ పార్టీకి ఓటమి తప్పదని లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల ఏడాది కాబట్టే రైతుల మీద ఎనలేని ప్రేమ కనబరుస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయన్నారు. ప్రధాని మోదీ ఈ నెల 8న రూ.20,000 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు తెలంగాణలో శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. ఇవాళ ప్రపంచ దేశాలు సైతం సమస్యల పరిష్కారం కోసం మోదీ, భారత్ వైపు చూస్తున్నాయని లక్ష్మణ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?