Hyderabad: పైవంతెనలు.. ఆపైన మెట్రో
ఇల్లు కట్టేటప్పుడు భవిష్యత్తు అవసరాల కోసం మేడపై స్తంభాలు నిర్మించి వదిలేస్తారు. అప్పటికి అదనపు అంతస్తు వేసేందుకు నిధులు లేకనో.. నిజంగానే అవసరం లేకనో అలా చేస్తుంటారు.
డబుల్ డెక్ ఎక్స్ప్రెస్వేల నిర్మాణం
ఈ విధానంలో సికింద్రాబాద్ నుంచి ఓఆర్ఆర్ వరకు రెండు ప్రాజెక్టులు
నాగ్పుర్లో రెండు అంతస్తుల్లో నిర్మించిన వంతెన
ఈనాడు, హైదరాబాద్: ఇల్లు కట్టేటప్పుడు భవిష్యత్తు అవసరాల కోసం మేడపై స్తంభాలు నిర్మించి వదిలేస్తారు. అప్పటికి అదనపు అంతస్తు వేసేందుకు నిధులు లేకనో.. నిజంగానే అవసరం లేకనో అలా చేస్తుంటారు. భవిష్యత్తులో అవసరమైనప్పుడు సులువు అవుతుందని ముందుచూపుతో ఇలా చేస్తుంటారు. ఇదే ఇప్పుడు సిటీలో కొత్తగా నిర్మించే ఎక్స్ప్రెస్వేలలో ప్రభుత్వం చేయబోతుంది. భవిష్యత్తులో మెట్రోరైలు నిర్మాణం చేపట్టేందుకు వీలుగా పైవంతెనతోపాటు మెట్రో స్తంభాలను నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇకపై ఎక్స్ప్రెస్వేలన్నీ డబుల్ డెక్లో నిర్మించబోతున్నారు.
ఇలా ఉంటుంది..
నగరంలో పలు చోట్ల పైవంతెనలను నిర్మించిన మాదిరే.. ఒక్కో వైపు మూడు వరుసలు చొప్పున మొత్తం ఆరు వరుసల్లో ఎక్స్ప్రెస్వేలు రానున్నాయి. పైన మెట్రో కోసం స్తంభాలను నిర్మిస్తారు. తొలుత ఈ స్తంభాలు నిర్మించి.. మొదటి అంతస్తులో ఫ్లైఓవర్ పూర్తిచేసి వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తారు. భవిష్యత్తులో నిధుల లభ్యత, అవసరాన్ని బట్టి పై అంతస్తులో వయాడక్ట్లతో మెట్రో ట్రాక్ నిర్మిస్తారు. నాగ్పుర్లో దేశంలో తొలిసారి ఈ విధంగా డబుల్ డెక్ ఫ్లైఓవర్ నిర్మించారు. హైదరాబాద్లో ఏకకాలంలో నిర్మించేందుకు నిధుల సమస్యగా ఉంది. అందుకే తొలుత ఫ్లైఓవర్.. ఆ తర్వాత నిధులు, అవసరాలకు అనుగుణంగా మెట్రోరైళ్లు వస్తాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆరే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
తొలుత ఎక్కడ?
* ఉత్తర తెలంగాణ నుంచి నగరంలోకి వచ్చే రెండు ప్రధాన మార్గాల్లో కంటోన్మెంట్ ప్రాంతంలోకి ప్రవేశించాక ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రెండు ఎక్స్ప్రెస్వేలను ఐదేళ్ల క్రితమే ప్రతిపాదించింది. అందుకు రక్షణ శాఖ అనుమతి, 150 ఎకరాల శాఖ భూమి బదలాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.
* ప్యారడైజ్, తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, కండ్లబోయ, ఓఆర్ఆర్ వరకు 18 కి.మీ. ఎక్స్ప్రెస్ వేని ఇదివరకు ప్రతిపాదించారు. ఇప్పుడు దీన్ని డబుల్ డెక్గా మారుస్తున్నారు. మెట్రో కోసం ఫ్లైఓవర్తోపాటు స్తంభాలు వేసి ఉంచుతారు.
* జేబీఎస్ నుంచి వెస్ట్మారేడుపల్లి, తిరుమలగిరి, లోతుకుంట, హకీంపేట, తూంకుంట, ఓఆర్ఆర్ వరకు 18 కి.మీ. డబుల్ డెక్ ఎక్స్ప్రెస్వేని చేపట్టనున్నారు. ఇక్కడ సైతం మూడు వరుసల ఎక్స్ప్రెస్తోపాటు మధ్యలో మెట్రో కోసం స్తంభాలు వేస్తారు.
బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్కు సవాల్..
తొలుత డబుల్ డెక్ ప్రతిపాదన బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు తీసుకొచ్చారు. అక్కడ ఇదివరకే మెట్రో ప్రతిపాదన ఉంది. ఆ తర్వాత ఫ్లైఓవర్ల ప్రతిపాదనలు వచ్చాయి. రెండు ఒకేసారి డబుల్ డెక్లో చేయాలని నాగ్పుర్ వెళ్లి అధికారుల బృందం అధ్యయనం చేసినా కార్యరూపం దాల్చలేదు. అదే ఇప్పుడు మెట్రో నిర్మాణానికి సవాల్గా మారబోతుంది. ఇప్పటికే ఈ మార్గంలో ఏడు పైవంతెనలున్నాయి. కొత్తగా మెట్రో వేయాలంటే వంతెనలు ఉన్న చోట్ల మళ్లీ ఆస్తుల సేకరణ చేయాలి. ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాల్గా ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి రాకూడదనే సర్కారు డబుల్డెక్పై కీలక నిర్ణయం తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండా విశ్వేశ్వర్రెడ్డి వినతిపై నిర్ణయం తీసుకోండి: ఈసీకి హైకోర్టు సూచన
[ 02-05-2024]
కొండా విశ్వేశ్వర్రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిరిశీలించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. -
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
[ 02-05-2024]
మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
హైదరాబాద్లో అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు
[ 02-05-2024]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘జనసేన’ పార్టీ గుర్తు ‘గాజుగ్లాసు’ను హైదరాబాద్లోని మూడు లోక్సభ నియోజకవర్గాల్లో చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు కేటాయించారు. -
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
[ 02-05-2024]
నాంపల్లికి చెందిన కిర్పాన్ కౌర్ ఖనూజా అబిడ్స్ స్లేట్ ది స్కూల్లో పదో తరగతి చదువుతోంది. మార్చి ఒకటిన ప్రీ ఫైనల్ పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై తల్లి అస్మిత్కౌర్ కలిసి ఇంటికెళ్తుండగా.. ఓ యువకుడు అడ్డొచ్చాడు. అదుపుతప్పి తల్లీకూతురు కిందపడ్డారు. -
హస్తం చెంతకా.. కమలం గూటికా?
[ 02-05-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో భాజపా, కాంగ్రెస్లు గులాబీ నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి పోటీపడుతున్నాయి. -
వారి ఓటును వారికి వేసుకోలేరు
[ 02-05-2024]
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంటుంది. ఇది చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎంఐఎం నుంచి ఎవరూ నిలబడటం లేదు. -
కొత్త ఓటరు కార్డులు లేనట్టేనా ?
[ 02-05-2024]
కొత్త ఓటర్లకు ఈసారి గుర్తింపు కార్డులు లేనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్కు మిగిలింది పది రోజులే. అయినా ఎన్నికల సంఘం ఇంకా ముద్రణ ప్రారంభించలేదనే విమర్శలొస్తున్నాయి. -
రూ.2.95 కోట్ల నగదు స్వాధీనం
[ 02-05-2024]
సరైన పత్రాల్లేకుండా బ్యాంకులకు తరలిస్తున్న రూ.1.06 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. -
అక్కడ.. పోలింగ్ సిబ్బంది అందరూ మహిళలే
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలకు నగరవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం మహిళా సిబ్బందిని నియమించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. -
ఐదొందలిస్తే అదనపు సేవ
[ 02-05-2024]
వైద్యులు ధ్రువీకరించినా.. రూ.500 ఇస్తేనే మీకు పిల్లలు పుట్టినట్టు ధ్రువీకరణ ఇస్తామంటూ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. కొన్ని మీసేవ కేంద్రాలు, కొందరు జీహెచ్ఎంసీ అధికారులు జనన, మరణ ధ్రువపత్రాల జారీని అవినీతిమయం చేశారు. -
ఓటరు చీటీలు మేమే ఇస్తాం
[ 02-05-2024]
నగరంలో ఓటరు చీటీల పంపిణీ గందరగోళంగా మారింది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి వాటిని పంపిణీ చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ కొన్ని నియోజకవర్గాల్లో నేతల చేతుల్లోకి వెళ్లింది. -
ప్రచారానికి రండి.. సదుపాయాలు దండి
[ 02-05-2024]
అయ్యా! పనివాళ్లు దొరకడంలేదు. నలుగురిని పిలుస్తుంటే ఒక్కరే వస్తున్నారు. అందరూ ప్రచారానికి వెళ్లిపోతున్నారు. యజమాని..: కూలీ కంటే డబ్బులు ఎక్కువ వస్తాయా..? -
మేయర్ ఇంట్లో చొరబడిన అగంతకుడు
[ 02-05-2024]
మేయర్ ఇంట్లోకి అగంతకుడు చొరబడ్డాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం..ఎన్బీటీనగర్లోని మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి మంగళవారం ఓ అగంతకుడు వచ్చి నేరుగా ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లాడు. -
చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స
[ 02-05-2024]
చిన్నారుల్లో అరుదుగా వచ్చే కాలేయ క్యాన్సర్కు చికిత్స చేసి అరుదైన ఘనత సాధించారు నిమ్స్ వైద్యులు. ఆస్పత్రి డైరెక్టర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ సర్జన్ నగరి బీరప్ప చికిత్స చేశారు. -
అమ్మాయిలా నటిస్తూ.. నగ్నచిత్రాలు పంపుతూ..
[ 02-05-2024]
బెట్టింగ్కు అలవాటుపడ్డ కుర్రాడు.. నేరస్థుడి అవతారమెత్తాడు. డేటింగ్ యాప్లో అమ్మాయిలా నటించి మోసగిస్తున్న అతడ్ని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
బోను వద్దకు వెళ్లి మేకను వదిలేసిన చిరుత
[ 02-05-2024]
విమానాశ్రయం రన్వే మైదానంలోకి నాలుగు రోజుల క్రితం చొరబడిన చిరుత మంగళవారం రాత్రి 10.57 గంటలకు ఓ బోను వద్దకు వచ్చింది. అందులో ఉన్న మేక జోలికి మాత్రం వెళ్లలేదు. -
ఓటర్లను మభ్యపెట్టడానికే భాజపాపై దుష్ప్రచారం
[ 02-05-2024]
ఆరు గ్యారంటీ పథకాల అమల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్ మండిపడ్డారు. -
ఠాణాకు చేరిన మైనర్ల ప్రేమ
[ 02-05-2024]
ఆ బాలికకు పదిహేనేళ్లు నిండలేదు. అబ్బాయికీ 18 లోపే. వీరి మధ్య చిగురించిన ప్రేమ గర్భం వరకు వెళ్లడంతో పెద్దలకు తెలిస్తే తిడతారని ఆ బాలుడు బాలికకు గర్భవిచ్ఛిత్తి మాత్రలు వేయించాడని తెలిసింది. -
సీఎంపై ఓయూ పీఎస్లో ఫిర్యాదు
[ 02-05-2024]
ఓయూ సెలవుల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ భాష సంస్కారవంతమైంది
[ 02-05-2024]
తెలంగాణ భాష ఎంత గొప్పదో పోతన, పాల్కుర్కి, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి, కాళోజీలలో ప్రతిఫలిస్తుందని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అన్నారు -
నిమ్స్ కార్మికులకు అండగా ఉంటా
[ 02-05-2024]
నిమ్స్ ఆస్పత్రిలో పనిచేసే కార్మికులకు అండగా ఉంటానని ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ఆస్పత్రిలో నిర్వహించిన కార్మిక దినోత్సవంలో పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ డేగ కళ్లు
[ 02-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటోంది. -
సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
[ 02-05-2024]
పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో పలువురు భారాస నాయకులు, కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్లో చేరారు. -
కోడ్ ముగిశాక హామీలన్నీ అమలు
[ 02-05-2024]
ఆరు గ్యారంటీల్లో అయిదింటిని అమలు చేశామని, మిగిలిన వాటినీ ఎన్నికల కోడ్ ముగిశాక తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్