ఖర్జూరాల విక్రయాల్లో నగరమే నంబర్ 1
రంజాన్ నేపథ్యంలో బేగంబజార్లో ఎండు పండ్లు, ఖర్జూరాల విక్రయ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ముస్లింలు ఉపవాసం అనంతరం ఖర్జూరాలతో పాటు డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు.
ఈనాడు, హైదరాబాద్
రంజాన్ నేపథ్యంలో బేగంబజార్లో ఎండు పండ్లు, ఖర్జూరాల విక్రయ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ముస్లింలు ఉపవాసం అనంతరం ఖర్జూరాలతో పాటు డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. హోల్సేల్గా విక్రయాలు చేస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల వాసులు బేగంబజార్కు వస్తుండటంతో ఈ ప్రాంతంలో మరింత రద్దీ కనిపిస్తోంది. విదేశాల నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ పలాస నుంచి వచ్చే ఖాజూ హోల్సేల్ ధరకే ఇస్తుండటంతో గిరాకీ పెరిగింది.
భారీగా అమ్మకాలు..
దేశంలోనే ఎక్కువగా ఖర్జూరాలను వినియోగించే నగరంగా హైదరాబాద్కు గుర్తింపు ఉంది. ఏటా సుమారు 400 ట్రక్కుల ఖర్జూరాల విక్రయాలు ఇక్కడ సాగుతున్నాయి. రంజాన్ నేపథ్యంలో విక్రయాలు పెరిగాయి. వ్యాపార వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. వేర్వేరు దేశాల నుంచి ఖర్జూరాలను చెన్నై, ముంబయికి నౌకా మార్గాల్లో తీసుకొచ్చి.. అక్కడి నుంచి నగరానికి రవాణా చేస్తుంటారు. వీటితో పాటు అమెరికా నుంచి బాదం, అరబ్ దేశాల నుంచి పిస్తా, వాల్నట్స్, అంజూర్, ఎండుద్రాక్ష, కుర్బానీ లాంటి ఎండు పండ్లు దిల్లీకి వచ్చి.. అక్కడి నుంచి ఇక్కడకు వస్తున్నాయి. ఖర్జూరాల్లో జహీదీ ఖర్జూరాలు కేజీ రూ.200 నుంచి రూ.400 ధర పలుకుతున్నాయి. కొనుగోలుదారుల ఖర్చు పెట్టే సామర్థ్యం బట్టి ఇరాన్, ఇరాక్, టునీషియా, జోర్డాన్, సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకున్న ఖర్జూరాలను కొనుగోలు చేస్తుంటారు. ప్రధానంగా ఖర్జూరాల్లో రాజుగా పిలిచే అజ్వా రకం కేజీ రూ.2,000 ధర పలుకుతోంది. ఇందులో అత్యధిక ఔషధ గుణాలుండటంతో.. ఒక్కొక్కరూ ఐదు కిలోల పెట్టెలను కొనుగోలు చేస్తుంటారని బేగంబజార్లోని వ్యాపారి రాజ్కుమార్ టండన్ తెలిపారు.
40 రకాలు..
నగరంలో ప్రస్తుతం 40 రకాల ఖర్జూరాలు విక్రయిస్తున్నారు. ఇందులో కిమియా, శుక్కారి, కుద్రీ, మరియమ్, మజాఫాతీ, కల్మీ, మష్రూక్, మేబ్రూమ్ రకాలను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. డ్రైఫ్రూట్స్ విషయానికొస్తే ఖాజు కిలో రూ.800 ఉంచి రూ.1,500 వరకు, బాదం రూ.800 నుంచి రూ.2,800, పిస్తా కేజీ రూ.1,000 నుంచి రూ.1,800, ఖర్జూరా కేజీ రూ.180 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. గతంతో పోల్చితే 10 నుంచి 20 శాతం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే