MP Laxman: కేసీఆర్‌, రేవంత్‌ డూప్‌ ఫైట్‌ చేస్తున్నారు: లక్ష్మణ్‌

హామీలు నేరవేర్చనందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రజల ఆగ్రహం చవిచూస్తున్నారని భాజపా రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు.

Published : 17 Apr 2024 17:13 IST

హైదరాబాద్‌: ఇప్పటికే భారాస పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ కూడా తుడిచిపెట్టుకుపోతుందని భాజపా ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీలు నేరవేర్చనందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రజల ఆగ్రహం చవిచూస్తున్నారని చెప్పారు. 

‘‘కాంగ్రెస్‌ నేతలు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారు. భాజపాను ఎదుర్కొనేందుకు కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగింది. ఇప్పుడు వాళ్లు డూప్‌ ఫైటింగ్‌ చేస్తున్నారు. కవితను ఎందుకు అరెస్టు చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడిగారు. భాజపా-భారాస మధ్య ఒప్పందం ఉందని దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయం’’అని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని