logo

విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..

విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది.

Updated : 24 Apr 2024 09:42 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

వర్షిత్‌రెడ్డి

ఉప్పల్‌, న్యూస్‌టుడే:విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. మేడిపల్లిలోని సత్యనారాయణపురానికి చెందిన దొంతూరి మధుసూదన్‌రెడ్డి, సుష్మ దంపతుల పెద్ద కుమారుడు వర్షిత్‌రెడ్డి(23) బీటెక్‌ పూర్తి చేశాడు. విదేశాలలో ఉన్నత చదువుకు సిద్ధమవుతున్నాడు. మంగళవారం ఉదయం నారాయణగూడలోని ఓ బ్యాంకులో స్టేట్‌మెంట్‌ తీసుకునేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఉప్పల్‌లోని నల్లచెరువు ప్రాంతంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. ఇదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన నర్సంపేట డిపో ఆర్టీసీ బస్సు మీది నుంచి వెళ్లింది. అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని