logo

కమలానికి ఆ‘షా’ కిరణం

పరేడ్‌ మైదానంలో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగం కమలం కేడర్‌కు జోష్‌నిచ్చింది.

Published : 06 May 2024 04:23 IST

ఈనాడు, హైదరాబాద్‌

పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న అమిత్‌షా, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వంశతిలక్‌

రేడ్‌ మైదానంలో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగం కమలం కేడర్‌కు జోష్‌నిచ్చింది. ప్రతి మాటలో చలోక్తులు, హాస్యాన్ని జోడించి చేసిన ప్రసంగానికి కేడర్‌ కేరింతలు కొట్టింది. రాహుల్‌ బాబా అంటూ రాహుల్‌ గాంధీని సంబోధించి..నవ్వించారు. ప్రసంగానికి ముందు జై శ్రీరాం అంటూ నినదించి.. సభికుల నుంచి కూడా నినాదాలు చేయించారు. ప్రధాని మోదీకి సరితూగే వారు దేశంలో ఉన్నారా అంటూ అమిత్‌షా ప్రశ్నించి.. లేరు అనే సమాధానం సభికుల నుంచి రాబట్టారు. సభలో కంటోన్మెంట్‌తోపాటు సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి జనం భారీగా తరలివచ్చారు. ప్రసంగాలకు ముందే చల్లటి గాలులు వీయడంతో సభకు హాజరైనవారు ఊరట చెందారు. ‘ఫిర్‌ ఏక్‌బార్‌ మోదీ సర్కార్‌’ అంటూ సభికులు కూడా నినదించేలా ప్రసంగాలు సాగాయి. ఇక్కడ 12 స్థానాలను గెలిపించడానికి మీరంతా సిద్ధమా అని అమిత్‌షా అడిగినప్పుడు.. ముక్తకంఠంతో ఔను అని సమాధానం వచ్చింది. అమిత్‌షా వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

హాజరైన భాజపా శ్రేణులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని