logo

మురుగు సమస్య తీరిస్తేనే ఓటేస్తాం

ప్రతి ఎన్నికల్లో మాటలు చెబుతారు.. మళ్లీ కంటికి కనిపించరు.. ఏళ్లుగా ఈ సమస్య గురించి ఎమ్మెల్యే నుంచి అధికారులదాకా తీసుకెళ్లినా ఇంతవరకు పరిష్కారం కాలేదు.

Published : 09 May 2024 02:06 IST

మురుగు నిలిచిన ప్రదేశం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు
జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రతి ఎన్నికల్లో మాటలు చెబుతారు.. మళ్లీ కంటికి కనిపించరు.. ఏళ్లుగా ఈ సమస్య గురించి ఎమ్మెల్యే నుంచి అధికారులదాకా తీసుకెళ్లినా ఇంతవరకు పరిష్కారం కాలేదు..ఈసారి మాత్రం సమస్య పరిష్కరిస్తేనే మేం ఓట్లు వేస్తామని జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 6వ డివిజన్‌ మల్లికార్జుననగర్‌ కాలనీవాసులు నిర్ణయించారు. బుధవారం మురుగు నిలిచిన ప్రదేశం వద్ద నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ అబద్దపు హామీలతో నాయకులు మోసగిస్తున్నారని, అందుకే ఈ సారి సమస్య పరిష్కరిస్తేనే ఓటేస్తామంటూ తీర్మానించినట్టు చెప్పారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని