సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వైకుంఠపాళి, ఫ్లాష్మాబ్...స్వచ్ఛంద సంస్థల, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన ‘ఓట్ ఛాలెంజ్’ ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి.
సత్ఫలితాలిచ్చిన ‘ఓట్ ఛాలెంజ్’
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వైకుంఠపాళి, ఫ్లాష్మాబ్...స్వచ్ఛంద సంస్థల, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన ‘ఓట్ ఛాలెంజ్’ ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి. గతంతో పోల్చితే రాజధానిలో ఓటింగ్ శాతం పెరిగింది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోనే 3.64శాతం వృద్ధి నమోదైంది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు స్థానాల్లోనూ పోలింగ్ శాతం పెరగడంతో మున్ముందు మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భావిస్తున్నాయి.
ఓటేయండి.. ఛాలెంజ్ విసరండి
ఓటింగ్శాతం పెంచేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు సరికొత్త ఆలోచన చేశాయి. ‘మీరు ఓటేయండి...మీకు తెలిసిన పది మందికి ఓటేయాలని ఛాలెంజ్ విసరండి’ అంటూ కొత్త నినాదం మంచి ఫలితం ఇచ్చింది. కాలనీ సంక్షేమ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో ఈ నినాదాన్ని విస్తృతం చేయడంతో ఈ కొత్త ఛాలెంజ్ ఎక్కువ మందికి చేరువైంది.
షేపింగ్ టుమారో బై ఓటింగ్ టుడే...
యంగిస్థాన్ ఫౌండేషన్ కొన్నేళ్లుగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఊకదంపుడు ఉపన్యాసాలకు బదులు యువత మెచ్చే స్టాండప్ కామెడీ, రాక్బ్యాండ్ల ద్వారా ఓటు విలువ చెప్పే ప్రయత్నం చేయడంతో యువత పోలింగ్ కేంద్రాలకు కదిలారు. ‘షేపింగ్ టుమారో బై ఓటింగ్ టుడే’ నినాదానికి ఎక్కువ ప్రాచుర్యం లభించింది. యువతకు చేరువయ్యేలా చేపట్టిన ‘తెలంగాణ లెట్స్ ఓట్’, ‘ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ’ పేరిట సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. -
బస్టాండ్లో గర్భిణికి కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు
కరీంనగర్ బస్ స్టేషన్లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. -
మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80
మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో టమాటా ధర అత్యధికంగా రూ.80 పలికింది. -
కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు జిల్లాలో ఊహించని ఘటన!
వేగంగా ప్రయాణిస్తున్న కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. -
రుషికొండ ప్యాలెస్లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: మంత్రి నారా లోకేశ్
రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. -
నేడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పాతబస్తీలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.