logo

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కమిటీ కన్వీనర్‌ ఎస్‌.రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం కడప ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు..కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు పరిస్తే వాటిని

Updated : 20 May 2022 03:39 IST


మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్‌
ఎస్‌.రామచంద్రారెడ్డి, చిత్రంలో నాయకులు

కడప, చిన్నచౌకు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కమిటీ కన్వీనర్‌ ఎస్‌.రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం కడప ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు..కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు పరిస్తే వాటిని తామే అమలుపరిచామని ప్రాంతీయ పార్టీలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరును చేర్చుకుంటున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఆయా రాష్ట్రాలకు కన్వీనర్లను నియమించారని తెలిపారు.  భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీనాథ్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, కల్యాణ్‌ తదితరులున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని