నకిలీ దందాపై ఉక్కుపాదం
మరో మూడు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనుండటంతో వానాకాలం పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు
విత్తనాలు, ఎరువుల విక్రయాలపై పరిశీలన
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
మరో మూడు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనుండటంతో వానాకాలం పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏటా విత్తనాల కొనుగోలులో రైతులు మోసపోతున్నారు. దళారులు దిగుబడుల ఆశ చూపి నకిలీ సరకు అంటగడుతుండటంతో నష్టపోతున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దు నుంచి, రైల్వే మార్గంలో వస్తుండటంతో వాటి నియంత్రణ కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో నకిలీ విత్తన దందాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీని నియమించింది. వ్యవసాయ, పోలీసు అధికారులతో పాటు విత్తనోత్పత్తి సంస్థల భాగస్వామ్యంతో కమిటీ నిఘా పెంచింది.
జూలపల్లిలో పురుగు మందుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు (పాతచిత్రం)
నిషేధిత విత్తనాలు సైతం..
రైతులు ఏటా నకిలీ, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. ఆరుగాలం శ్రమించినా పంట దిగుబడి రాకపోగా అప్పులే మిగులుతున్నాయి. జిల్లాలో వరి, పత్తి అధికంగా సాగవుతుండగా నకిలీ వరి విత్తనాలు సక్రమంగా మొలకెత్తకపోవడం, దిగుబడి రాకపోవడం పరిపాటిగా మారింది. కలుపు నాశని మందులను తట్టుకునే జన్యు మార్పిడి రకాలైన బీటీ-3 విత్తనాలతో పత్తి సాగులో శ్రమ తక్కువ ఉంటుందంటూ దళారులు ప్రచారం చేస్తున్నారు. దీంతో రైతులు వాటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే పత్తిలో గ్లైఫోసెట్(గడ్డిమందు) పిచికారీ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించడంతో ప్రభుత్వం బీటీ-3 రకం పత్తి విత్తనాలను నిషేధించింది. అయితే పలు చోట్ల వ్యాపారులు వాటిని రైతులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
నిర్ధారణ అయితే కేసులు
జిల్లాలో వానాకాలంలో 2,77,743 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. 2,08,814 ఎకరాల్లో వరి, 57,269 ఎకరాల్లో పత్తి, 2,500 ఎకరాల్లో ఆయిల్పామ్, మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు వేయనున్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు వ్యవసాయ, పోలీసు, విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారులతో నియమించిన టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగింది. నకిలీ సరకులపై వీరికి నేరుగా ఫోన్ చేసినా, ఫిర్యాదు చేసినా దాడులు చేసి స్వాధీనం చేసుకుంటారు. నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తారు. మండల స్థాయిలో ఏవో, ఎస్సై, సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నారు.
జిల్లా టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు
శ్రీనాథ్, ఏడీఏ, పెద్దపల్లి 72888-94148
కిషోర్కుమార్, ఏడీఏ, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, 72888-79669
మల్లయ్య, ఏఎస్సై, మంథని 94404-61918
అప్రమత్తతే కీలకం
- విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేసిన వెంటనే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి.
- అధికారులు సిఫార్సు చేసిన నాణ్యమైన, అధిక దిగుబడి వచ్చే రకం విత్తనాలనే ఎంచుకోవాలి.
- తక్కువ ధరకు అమ్ముతున్నారని నాసిరకం విత్తనాలను కొని నష్టపోవద్దు.
- లైసెన్సు పొందిన డీలర్లు, దుకాణదారుల వద్దనే కొనుగోలు చేయడం మేలు.
- దళారుల మాటలు నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు పాటించాలి.
నిరంతర పర్యవేక్షణ
జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులపై క్షేత్ర స్థాయిలో చైతన్యం కల్పిస్తున్నాం. విత్తనాల ఎంపికలో రైతులకు ఏఈవోలు, ఏవోలు మార్గదర్శనం చేస్తున్నారు. సరకు కొనుగోలు చేసిన వెంటనే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. నకిలీలను అరికట్టడానికి జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. మండలాల్లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తారు.
డి.ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేనేం పాపం చేశానమ్మా!
[ 15-06-2024]
అమ్మా.. ఏడుస్తున్నావా! ఎందుకమ్మా రోదిస్తావ్.. నీ ఒడిలో ఉండగానే ఓ మృగం నన్ను కాటేసిందని కుమిలిపోతున్నావా! తల్లి పొత్తిళ్లలోనే ఆడపిల్లకు రక్షణ లేదని బాధ పడుతున్నావా.. అయినా.. ఏడ్చి ఏం సాధిస్తావమ్మా? -
వేగంగా.. పారదర్శకంగా..!
[ 15-06-2024]
గత సర్కారు హయాంలో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం అమలు తీరు, మంచినీరు ఏ విధంగా అందుతుంది? జలాలపై ప్రజల అభిప్రాయ సేకరణకు ప్రస్తుత ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వే చేయిస్తోంది. -
ప్రగతి చక్రానికి రథ సారథులు
[ 15-06-2024]
ఆర్టీసీ అనగానే టక్కున గుర్తుకొచ్చేది ప్రజా రవాణా వ్యవస్థ. అన్ని వర్గాల ప్రజలను బస్సుల్లో వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటుంది. వీటికి సారథులుగా వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులే కీలకపాత్ర పోషిస్తుంటారు. -
ఎవరికీ పట్టని వలస బతుకులు
[ 15-06-2024]
వలస కార్మికుల రక్షణకు పాలకులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి -
సొంతింటి కల నెరవేరేదెన్నడో?
[ 15-06-2024]
పేదల సొంతింటి కల నెరవేరబోతోంది. గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. -
రామగుండం విద్యుత్తు కేంద్రం విస్తరణపై సందిగ్ధం
[ 15-06-2024]
రామగుండం విద్యుత్తు కేంద్రం విస్తరణపై మరోసారి సందిగ్ధం నెలకొంది. మూకుమ్మడిగా అధికారులను యాదాద్రి విద్యుత్తు కేంద్రానికి డిప్యుటేషన్ కల్పిస్తూ ఆదేశాలు రావడంతో ఆందోళన నెలకొంది -
నిధులు చాలక... అంగన్వాడీ భవనాలు పూర్తికాక
[ 15-06-2024]
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆట, పాటలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అయితే సొంత భవనాలు లేక చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు -
మురుగు శుద్ధి ఎప్పుడో?
[ 15-06-2024]
జిల్లా కేంద్రం.. సిరిసిల్ల పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. జనావాసాలు, డైయింగ్ యూనిట్ల నుంచి నిత్యం 20 ఎంఎల్డీ (మిలియన్ లిక్విడ్ డిఛార్జి)లకు పైగా వ్యర్థ జలాలు నేరుగా మానేరు వాగులో కలుస్తున్నాయి -
జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు దంపతులు
[ 15-06-2024]
మావోయిస్టు దంపతులు శుక్రవారం కరీంనగర్ సీపీ, వరంగల్ కమిషనరేట్ ఇన్ఛార్జి కమిషనర్ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో జనజీవన స్రవంతిలో కలిశారు. కరీంనగర్లో జరిగిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు -
ద్విభాషా పుస్తకం.. అవగాహన సులభం
[ 15-06-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో ఉన్నతమైన బోధనను విద్యార్థులకు అందజేయాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వం ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టింది. -
ఆలయ ఉద్యోగుల్లో బదిలీల గుబులు
[ 15-06-2024]
ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఆలయ ఉద్యోగులకు బదిలీల గుబులు పట్టుకుంది. దీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్న వారికి ఈసారి స్థానచలనం తప్పదని చెబుతున్నారు. -
అప్పు తీసుకున్న వారి వేధింపులు..మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
[ 15-06-2024]
అప్పు తీసుకున్న వ్యక్తులు తిరిగి చెల్లించకపోగా చంపుతామని బెదిరించడం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. -
హమ్మయ్య.. జీతాలు వచ్చాయి
[ 15-06-2024]
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్న 200 మంది నర్సింగ్ అధికారులకు ఎట్టకేలకు జీతాలు వచ్చాయి -
పూడిక తొలగింపుతోనే.. భవిష్యత్తుకు భరోసా
[ 15-06-2024]
శ్రీరాంసాగర్ జలాశయంలో పూడిక పేరుకుని నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు తగ్గినట్లు ఇటీవలే అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు