ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు.
రాష్ట్రంలో జిల్లా స్థానాలివి
ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు
న్యూస్టుడే-కరీంనగర్ విద్యావిభాగం: రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేటు కళాశాలలతో దీటుగా మార్కులు సాధించారు.
ప్రభుత్వ కళాశాలల హవా..
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 950కిపైగా మార్కులు సాధించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఎం.రిషిత పటేల్ ఎంపీసీలో 983, యు.సాయిప్రియ ఎంపీసీలో 977, బైపీసీలో సానఅంజుమ్ 968, సీఈసీలో మిష మహ్విన్ 965 మార్కులు పొందారు. ప్రభుత్వ సైన్స్ కళాశాల విద్యార్థి సాయితేజ బైపీసీలో 965, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి జిషన్ బిన్ బక్రన్ ఎంపీసీలో 955 మార్కులు సాధించారు. ఆదర్శ పాఠశాలల్లోనూ ఉత్తమ మార్కులు వచ్చాయి. గంగాధర ఆదర్శ పాఠశాల విద్యార్థి ఆర్.వర్షిణి ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 466 మార్కులు కైవసం చేసుకుంది.
నేటి నుంచి రీకౌంటింగ్
అందరి కృషితో ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఈసారి కళాశాలలకు సెలవులు తక్కువగా రావడంతో విద్యార్థులు కష్టపడి చదివారు. అన్ని కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల కృషితో గతేడాది ఫలితాల కంటే ఈసారి మెరుగైన స్థానం సాధించాం. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 24వ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ చేయించుకోవాలనే ఆసక్తి గల వారు గురువారం నుంచి వచ్చే నెల 2వ తేదీలోపు రుసుంలు చెల్లించాలి.
జగన్మోహన్రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారి
భళా బాలికలు..
- ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 63.41 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. గతేడాది అదే స్థానంలో ఉండటం విశేషం. మొత్తం 15,058 మంది పరీక్షకు హాజరుకాగా 9548 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు 56.13, బాలికలు 71.64గా నిలిచారు.
- ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 74.39 శాతంతో రాష్ట్రంలో నాలుగో స్థానం పొందడం విశేషం. గతేడాది 8 స్థానంలో ఉండగా.. ఈసారి మెరుగైంది. మొత్తం 13,407 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 9974 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు 69.14, బాలికలు 79.99గా నిలిచారు.
- ఒకేషనల్ ఫలితాల్లో ఈసారి జిల్లా కొంత వెనకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 42.64 శాతంతో 32 స్థానంలో నిలిచింది. గతేడాది జిల్లా 31 స్థానంలో ఉంది. మొత్తం 1543 మంది హాజరుకాగా, 658 మంది ఉత్తీర్ణులయ్యారు.
- ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 57.62 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 29 స్థానాన్ని అందుకుంది. గతేడాది 28 స్థానంలో నిల్చింది. మొత్తం 1437 మంది పరీక్షలు రాయగా 828 మంది ఉత్తీర్ణులయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణపై భాజపా నేతలది సవతి తల్లి ప్రేమ: సీఎం రేవంత్రెడ్డి
[ 03-05-2024]
రిజర్వేషన్లే ప్రధాన అంశంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
పోస్టల్ ఓట్లు..అభ్యర్థుల పాట్లు
[ 03-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు. -
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మూడు ఏసీలు
[ 03-05-2024]
కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’, -
ఓటు ఘనం.. పోటీ నామమాత్రం
[ 03-05-2024]
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. -
యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం
[ 03-05-2024]
నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. -
వేములవాడ ఆలయ హుండీ ఆదాయం రూ. 1.52 కోట్లు
[ 03-05-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. -
రైతుల చెంతకు రాజన్న కోడెలు
[ 03-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. -
చోరీ కేసు నిందితుడి అరెస్టు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. -
సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 03-05-2024]
ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
రాజీ మార్గమే రాజ మార్గం
[ 03-05-2024]
రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రసాద్ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది. -
స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
[ 03-05-2024]
వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే పల్లెలు, పట్టణాల్లో ప్రగతి
[ 03-05-2024]
భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
రామగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి
[ 03-05-2024]
కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులా..!
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు. -
లైట్లు లేవు... ఏసీలు పనిచేయవు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం