చిన్నబోయిన బొంకూర్
వారంతా రోజూవారీ వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేనే కుటుంబం గడిచే పరిస్థితి.. ఎప్పటిలాగే కూలీకి వెళ్లి శ్రమించారు. పనులు పూర్తి చేసుకొని చిరునవ్వులతో ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.
కాల్వలో బోల్తా పడిన ట్రాక్టర్
వారంతా రోజూవారీ వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేనే కుటుంబం గడిచే పరిస్థితి.. ఎప్పటిలాగే కూలీకి వెళ్లి శ్రమించారు. పనులు పూర్తి చేసుకొని చిరునవ్వులతో ఇళ్లకు తిరుగుపయనమయ్యారు. తాము ఏరిపోసిన కంకులే తమమీద మృత్యుబండలై ప్రాణాలు తోడేస్తాయని ఊహించలేదు. ఇంకో పది నిమిషాల్లో ఇళ్లకు చేరుకునేవారే. అంతలోనే ఊహించని ప్రమాదంతో ముగ్గురు అనంతలోకాల్లో కలిసి కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచారు.
న్యూస్టుడే, సుల్తానాబాద్
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతిచెందగా బాధిత కుటుంబాలు ఘొల్లుమన్నాయి. మృతిచెందిన మహిళలు, చికిత్స పొందుతున్న వారితో తమకున్న అనుబంధాలను స్థానికులు గుర్తు చేసుకొంటూ కన్నీరుపెట్టారు. సుల్తానాబాద్ మండలం మియాపూర్ శివారులో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనతో చిన్నబొంకూర్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల్లో ఏ కుటుంబాన్ని చూసినా కన్నీటి గాథలే కనిపించాయి. క్షతగాత్రులు పోచంపల్లి పద్మ, ఈజ్జగిరి రాజమ్మ, విజ్జగిరి రమ, కానుగుల సరిత, పోచంపల్లి లక్ష్మిలు కరీంనగర్లో చికిత్స పొందుతుండగా.. వారి కుటుంబాల్లో ఆందోళన పరిస్థితి తలెత్తింది.
అన్నీ తానై..
చిన్నబొంకూర్కు చెందిన పోచంపల్లి రాజమ్మ భర్త రాజకొమురయ్య ఏడేళ్ల క్రితం మృతిచెందారు. రాజమ్మ అన్నీ తానై.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపింది. ఇద్దరు కుమారుల వివాహాలు జరిపించింది. కొడుకులు, కోడళ్లు గ్రామంలో కూలీ పనులు చేస్తూ ఉమ్మడి కుటుంబంగా కొనసాగుతున్నారు. ఇంటికి పెద్దదిక్కైన రాజమ్మ ఇక లేరనే విషయాన్ని కొడుకులు కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
కుమారుడి పెళ్లి చూడకుండానే..
జూలపల్లి మండలం తేలుకుంటకు చెందిన బేతి లక్ష్మి, మహిపాల్రెడ్డి ఉపాధి కోసం చిన్నబొంకూర్కు వచ్చారు. కూలీనాలి చేసి రెండెకరాలు కొనుగోలు చేశారు. వ్యవసాయంతో పాటు పలు కూలీ పనులు చేస్తూ కుమార్తె వివాహం చేశారు. కొడుకును డిప్లొమా చదివించి మందమర్రి ఓపెన్కాస్టులో తాత్కాలిక ఉద్యోగిగా చేర్చించారు. త్వరలోనే వేణుకు వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నామని.. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని మహిపాల్రెడ్డి విలపించారు.
చిన్నారులను ఓదార్చేదెలా?
చిన్నబొంకూర్కు చెందిన మల్యాల వెంకటేశ్ దంపతులకు పన్నెండేళ్లలోపు కొడుకు అర్జున్, కుమార్తె సహస్ర సంతానం. వెంకటేశ్ అన్నదమ్ముల పొత్తులో ఉన్న 5 ఎకరాలతోపాటు రెండెకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ట్రాక్టర్ ప్రమాదంతో తన చేజేతులా భార్యను చంపుకొన్నానని వెంకటేశ్ ఘొల్లుమన్నారు. ఇంటి వద్ద చిన్నారులు అన్నం తింటున్న క్రమంలో తల్లి మరణవార్త తెలిసింది. సగం అన్నం తిన్న ప్లేట్లు అలాగే ఉండిపోగా.. చిన్నారుల దుఃఖం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
రాజమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?