నిజామాబాద్ను గుండెల్లో పెట్టుకుంటా
‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది.
కార్నర్ మీటింగ్లో గులాబీ దళపతి కేసీఆర్
ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్, హాజరైన ప్రజలు
ఈనాడు, నిజామాబాద్, న్యూస్టుడే, నిజామాబాద్ అర్బన్ : ‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను. ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’’ అని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం నిజామాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నెహ్రూ పార్క్ చౌరస్తాలో జరిపిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. ఆరు గ్యారంటీలంటూ హామీలిచ్చిన కాంగ్రెస్..వాటిని అమలు చేయటం లేదని మండిపడ్డారు. అవి అమలు కావాలంటే.. ప్రభుత్వం మెడలు వంచి .పోరాటం చేసేందుకు భారాస అభ్యర్థిని గెలిపించాలన్నారు నిజామాబాద్లో గత ఎన్నికల్లో భాజపా ఎంపీని గెలిపించారని..ఆయన వల్ల ఇక్కడ ఏం లాభం జరగలేదని విమర్శించారు. తమది సెక్యులర్ విధానమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి 20 శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయని.. ముస్లింలు ఆ పార్టీకి ఓటేస్తే భాజపా లాభపడుతుందన్నారు. పులిలాంటి గోవర్ధన్ను గెలిపించాలని చెప్పారు. తెల్లారితే విద్వేషాలు రెచ్చగొట్టే భాజపాకు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. బస్సుయాత్రగా నిజామాబాద్కు చేరుకున్న భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద మహిళలు మంగళహారులతో స్వాగతం చెప్పారు. పాత కలెక్టరేట్ కూడలి నుంచి ర్యాలీ ప్రారంభమైంది. నెహ్రూ పార్క్ చౌరస్తా వరకు సాగింది. బస్సులో నుంచే కేసీఆర్ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం నెహ్రూ పార్క్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్కు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. కేసీఆర్ తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రసంగించారు.
జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం
జగిత్యాల : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జగిత్యాల రోడ్షోలో పాల్గొన్న భారాస అధినేత కేసీఆర్ రాత్రి ఎమ్మెల్సీ ఎల్.రమణ నివాసంలో బస చేశారు. సోమవారం రోజంతా అక్కడే ఉన్న కేసీఆర్ నాయకులతో సమావేశమయ్యారు. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్రెడ్డి, భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ వసంత, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు డాక్టర్ ఎం.సంజయ్కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీమంత్రి జి.రాజేశంగౌడ్, తదితరులతో మాట్లాడారు. ప్రచారం తీరు, గెలుపు అంశాలపై చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు
[ 18-05-2024]
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారికి చందనోత్సవాన్ని నిర్వహించారు. -
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు