logo

రూ.9.42 లక్షల నగదు పట్టివేత

జగిత్యాల పట్టణం మోచిబజార్‌లో ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టగా సారంగాపూర్‌ మండలం రేచపల్లి గ్రామానికి కె.శిరీష ఎలాంటి ఆధారం లేకుండా తీసుకెళ్తున్న రూ.4.84 లక్షలను పట్టుకున్నారు.

Published : 08 May 2024 04:44 IST

మెట్‌పల్లిలో పట్టుకున్న నగదుతో ఎస్సై చిరంజీవి

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల పట్టణం మోచిబజార్‌లో ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టగా సారంగాపూర్‌ మండలం రేచపల్లి గ్రామానికి కె.శిరీష ఎలాంటి ఆధారం లేకుండా తీసుకెళ్తున్న రూ.4.84 లక్షలను పట్టుకున్నారు. పట్టణ ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో టవర్‌ ప్రాంతంలో గాంధీనగర్‌కు చెందిన రమేష్‌ దగ్గర రూ.58 వేలను సీజ్‌ చేశారు.

మెట్‌పల్లి: మెట్‌పల్లిలో రూ.4 లక్షలు పట్టుకున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. మంగళవారం స్థానిక పాతబస్టాండ్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. పట్టుకున్న నగదును ఎన్నికల గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు